Jan 19, 2011

న్యాయం ఇంకా బతికే ఉందా?

గుంతకల్లు ఎమ్మెల్యేకు జైలుశిక్ష
కర్నూలు, న్యూస్‌టుడే: పరిశ్రమలకు సంబంధించిన నిబంధనలు పాటించని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే కె.మధుసూదన్‌, మేనేజర్‌ దేవరాజ్‌లకు మూడు నెలలు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ కర్నూలు అడిషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ టి.హరిత సోమవారం తీర్పు చెప్పారు. శాసనసభ్యుడు మధుసూదన్‌ కర్నూలు జిల్లా కల్లూరు మండలం అశ్వత్థాపురం గ్రామ పరిధిలో రాయలసీమ గ్రీన్‌స్టెలై ఇండస్ట్రీని నడుపుతున్నారు. దీనికి మేనేజర్‌గా దేవరాజ్‌ వ్యవహరిస్తున్నారు. 2006 జులై 20న పరిశ్రమ నుంచి విషవాయువు వెలువడి రాజశేఖర్‌, రెడ్డిపోగు తిమ్మరాజు, తిమ్మప్ప అనే కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు ఫ్యాక్టరీ చట్టం కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి మూడు నెలలు జైలుశిక్ష విధించారు. వివిధ సెక్షన్ల కింద రూ.60 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి టి.హరిత ఆదేశించారు. నిందితులు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకుంటామని పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది.

-------------------------------------
ఓ ఆడకూతురు, ఓ యం.యల్.ఏ ని బొక్కలోకి నెట్టటమా? అదీ కర్నూలో? వారెవా. ఇంకా న్యాయం బతికే ఉందన్నమాట. ఐనా పై కోర్టుకి వెళ్తున్నాడుగా, అక్కడ తేల్చి పడేస్తారు.
పేరు *గ్రీన్* ఇండస్ట్రీ. వెలువడేవి విషవాయువులు. ఇలా ఉంది మన పారిశ్రామీకరణ.
హైద్ చుట్టుపక్కల ఎన్ని ఇట్లాంటి *ఇండస్ట్రీస్* ఉన్నాయో? ఎన్ని విషవాయువుల్ని వెదజల్లుతున్నాయో?
హైద్ లో ఉండే రోజుల్లో గమనించేవాణ్ణి, టాం౨కర్లు *ఇండస్ట్రియల్ వేస్ట్* ని తీస్కెళ్తుండేవి. ఆ టాం౨కర్ల ఎనకమాల వెళ్ళే ద్విచక్రవాహన చోదకుల పరీస్థితి వర్ణనాతీతం. టాం౨కరు మూత సరిగ్గా పెట్టరు. లేక ఔట్ లెట్ లోంచి లీక్ అవుతుంటుంది. తల్చుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
ఏమైనా, పై తీర్పు, మెచ్చుకోతగ్గది.

మున్ముందు మన జ్యుడీషియరి సిస్టం పైలాంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలని, కనీసం విషవాయువులని గాలిలోకి రాకుండా ఉండేందుకు పై ఇండస్ట్రీ లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనీ కోరుకుంటా.

No comments:

Post a Comment