Feb 28, 2009

సత్యం - ఇదీ సత్యం

సత్యం రామలింగరాజు కుంభకోణంపై శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి కాలం ఇక్కడ చదవండి


చివరి రెండు పేరాలు
కొందరు జారడు బల్ల మీద క్రమంగా జారుతారు. కొందరు జారి ఏదో ఒకచోట నిలిచిపోతారు. కొందరు పుంజుకుని మళ్లీ మెట్లెక్కుతారు. కొందరే - రాడ్ స్టీగర్లూ, ప్రొఫెసర్లూ, రామలింగరాజులూ అవుతారు. ఆ పతనం క్రమంగా జరగదు. హఠాత్తుగా, స్పష్టంగా, భయంకరమైన వేగంతో జరుగుతుంది. విచారణలూ, జైలు శిక్షలూ, అవమానాలూ, ఆత్మహత్యలూ - ఇవన్నీ కధలో భాగం. అవి పతనం తర్వాతి పర్యవసానాలు. కాని ఎందుకు ఈ పతనం? కారణం ఏమిటి?
గుర్తుపట్టగలిగితే కారణాన్ని - కొన్నివేల సంవత్సరాల కిందట భగవద్గీత చెప్పింది. దానికి హిందూమతం, శ్రీకృష్ణుడూ, దేవుడూ, తీవ్రవాదం - లాంటి రకరకాల రేపర్లు తొడిగి చాలామంది "కుహానా" ఆధునికులు అటకెక్కించారు. కాని పలకరితే మనిషిని కాపాడే శాశ్వత విలువల్ని ఈ దేశంలో పెద్దలు 5000 సంవత్సరాల కిందట పొందుపరచారని గర్వపడడానికే ఈ కాలమ్. బగవద్గీత పుక్కిట పురాణంకాదు. మతఛాందసం కాదు. మనిషి మనుగడని నిర్దేశించే మాన్యువల్. అందుకనే దాన్ని ఏ తరానికి ఆ తరం మేధావులు ఆ కాలానికి అన్వయిస్తూ భాష్యం చెపుతూ వచ్చారు. అనిబిసెంట్ వంటి విదేశీయురాల్ని భగవద్గీత ఆకర్షించింది.
సాంఖ్య యోగంలో 62,63 శ్లోకాల వివరణతో ఈ కాలం ముగిస్తే చాలు.
ఇంద్రియాలను ఉత్తేజపరిచే విషయాల గురించి ఆలోచించే కొలదీ 'ఆసక్తీ పెరుగుతుంది. ఆసక్తి వల్ల వాటిని సంపాదించాలనే 'కోరిక' పుడుతుంది. కోరికవల్ల దానికేదైనా విఘాతం కలగడంతో 'కోపం' పుట్టుకొస్తుంది. కోపం 'అవివేకాన్నీ కలిగిస్తుంది. అవివేకం వల్ల మంచెడ్డల విచెక్షణ పోతుంది. దానితో 'బుద్ధి' నశిస్తుంది. తర్వాత మానవుడు పతనమౌతాడు.
'సత్యం' విషాదం ఈ సత్యాన్ని ఆవిష్కరించగలిగితే మన జీవితాల్లో కొత్త పుటని తెరచినట్టే. ఈ నిజాన్ని నమ్మితే వెంటనే 'భగవద్గీతా బూజు దులపండి.

Feb 25, 2009

పిల్లలకి చదువుతోబాటు సామాజిక బాధ్యత నేర్పాలి

ఈ మధ్య మన సహ బ్లాగరు అరుణ పప్పు గారి ఓ టపా "ఒక కధనం"కి నేను ఇలా కామెంటు రాసా:-

ఆడవాళ్లు స్వేఛ, మగవాళ్లు స్వేఛ, మనిషి స్వేఛ అనేది ఒక మల్టై ఫోల్డెడ్ ఇస్స్యూ. మన సమాజం ఆ మాటకొస్తే ఏ దేశంలోనూ స్త్రీకి నూటికి నూరు శాతం స్వేఛ లేదు. ప్రతీ బలమైన జంతువు బలహీనమైన జంతువునే వేటాడాలని చూస్తుంది. ఇప్పటి మన సమాజంలో, ఈ ఆధునిక యుగంలో, ఇలాంటి "అనుకోని దాడులు, దోపిడీ"లకి కారణం ఏంటంటారు? మా ఇంట్లో మా నాన్నగానీ, అమ్మగానీ "మనకేంటి!! ఈద్దరూ అబ్బాయిలే" అనే మాట నేను ఎప్పుడూ విన్లా. మా సూరిగాడు పుట్టినప్పుడుకూడా "అబ్బా!! అబ్బాయి పుట్టాడహో" అనేమి అనుకోలేదు, ఇప్పుడు అనఘ పుడితే "అయ్యో!! అమ్మాయి పుట్టిందేంటిరా ఖర్మా" అనుకోలేదు. నా ఉద్దేశంలో జనాల ఆలోచనా సరళిలో మార్పు రానంతవరకూ జీవితాలింతే.
ఇలాంటి ఎట్రాసిటీస్ చేసేవారు, అంటే, అమ్మాయి నడుస్తుంటే వెళ్లి ఢీ కొట్టడం ఇలాంటివి, వయసు పొంగులో (ఎడాలసెన్సు) చేసేవాళ్లు ఎక్కువశాతం అయితే, అదో మానసిక వ్యాధితో చేసేవాళ్లు కొంతమంది.
గర్హించతగ్గ విషయం ఏంటాంటే, ఈ సోకాల్డ్ శ్రీరాం సేన "ప్యాంటు చొక్కాలు, జీన్సు" వేస్కుని, "సారాయి అమ్ముతున్న వాణ్ని" వదిలేసి అమ్మాయిల్ని కొట్టడం. ఇది కేవలం ఓ ప్రత్యేకమైన అజెండాతో చేసింది మాత్రమే అనిపించింది నాకు.
అసలు ఇలాంటి వాటికి కారణాలు ఏంటి? యూత్ పై నేను రాసిన పోష్టులోలా(http://ramakantharao.blogspot.com/2009/01/so-called.html), ఇది ఓ వర్గం యొక్క జాఢ్యం. ఆ వర్గం రాజకీయ వర్గం కావొచ్చు, లేక డబ్బునోడు కావొచ్చు, లేక ఇంట్లోని తల్లితండ్రుల గొడవల్తో చికాకెత్తిపొయ్యి ఓ రకమైన ఇంబ్యాలెన్సుతో మానసికంగా వికలాంగత్వం చెందినోడు కావొచ్చు, దీన్ని మనం ఉన్మాదం అనికూడా అనుకోవచ్చు.
"a man on a bicycle stretched his hand.....orange rubber bands around his ankles." ప్రతీ మగోడిలోనూ ఇలాంటోడు ఉంటాడు. కొంతమందికి నిద్రావస్తలో, కొంతమందిలో చాలా యాక్టివ్గా. ఇంట్లో కాలేజికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లినోడు బయట ఏంచేస్తున్నాడో ఎలా తెలుస్తుంది.

సోదాపి అసలు నే చెప్పదల్చుకున్నదానికి వస్తే - నా దృష్టిలో దీనికి మార్గం -
౧. పిల్లలకి చదువుతోబాటు సామాజిక బాధ్యతని బోధించాల్సిన సమయం వచ్చింది.
౨. ఇకనైనా రాజకీయనాయకులు కనీసం స్త్రీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధుల్ని మింగటం ఆపి "సంక్షేమం" వైపు నడావాలి
౩. ఉన్నత విద్యలకి వెళ్ళేప్పుడు కేవలం మార్కులు కొన్నుక్కున్నాడా లేదా కన్నా విధిగా
ఎ. పిల్లోడి సామాజిక ధృక్పదం ఏంటి
బి. వాడు ఎలాంటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు
సి. తన కింది జనాలతో ఎలా మెలుగుతున్నాడు(తనకన్నా బలహీనమైన వాళ్లతో)
డి. పై జనాలతో ఎలా మెలుగుతున్నాడు(తనకన్న బలమైన వాళ్లతో)
ఇలాంటి విషయాల్ని కూడా వెయిటేజీ ఇచ్చి, సామాజిక వికాసం లేనోడికి ఒకటో ర్యాంకు వచ్చినా ఉపయోగంలేదు అనేలా ఉండాలి.
---------------------------

ఇప్పటిదాకా నేను మన సమాజం గుడ్దిగా పాటిస్తున్న, అనుసరిస్తున్న, యువత ఓ చట్రంలో ఇరుక్కుపోయి అదే చట్రం ఊబిలోకి కూరుకుపోతున్న అంశాలపై కొన్ని పోస్టులు రాసాను, అవి, నాతిచరామి, 2035, ముందుతరాలకి ఆస్థులు సంపాదన, So Called యూత్ లాంటివి.
నా దృష్టిలో మన ఈనాటి సమాజంలోని ప్రతీపౌరుడికి కావాల్సింది, అస్సలు లేనిదీ - సామాజిక బాధ్యత. మన విద్యావిధానంలో సామాజిక బాధ్యతని ఒక అంశంలా దేనికి జొప్పించకూడదూ? అదొక పాఠ్యాంశంగా అయినా లేక ఒక వర్కషాప్ గా అయినా. ప్రతీ నెలలో ఓ రోజున తరగతి దాటి బయటి ప్రపంచంలోకి తీస్కెళ్లటం, పిల్లలకి ఓ స్పృహని కలుగజేయటం ఇలా. రిసైకిల్ అంటే ఏంటి, కాయితాన్ని ఎలా వాడుకోవాలి, చెట్లు ఏంటి, నీళ్ల వాడుక ఎలా, ఎన్వైరాన్మెంటు గురించి, ప్లాస్టిక్కు గురించి ఇలా.

Feb 24, 2009

నాతిచరామి

మన పెళ్లిల్లలో అతి ముఖ్యమైన మంత్రం -
'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి". ఇంతవరకూ బాగానే ఉంది. ప్రకృతి స్వభావాలతో కూడ అని చెప్పించకపోవటం నమ్మలేని నిజం. అంటే, ధర్మ అర్ధ కామములలో కలసి నడుద్దాం అన్నారేకాని, ప్రకృతి స్వభావంతో బుద్ధి వికటిస్తే మాత్రం ఏమి చెయ్యాలో చెప్పకపోవటం.

అసలు కధ:
మగాడు ఆడదాన్ని దేనికి శీలపరీక్షకి గురిచేస్తాడు?

ఉదాహరణ:-
నేను ఇంతక ముందు ఉన్న అపార్టుమెంట్లో మా పక్క బ్లాకులో ఓ తమిళ కుటుంబం ఉండేది. అతనూ ఓ కన్సల్టెంటే. మేము ఆ అపార్టుమెంట్లో చేరినప్పటికి ఆమె కడుపుతో ఉంది. వాళ్లకి పాప పుట్టింది అనుకుంటా. తర్వాత్తర్వాత హలో అంటే హలో అనుకుంటూండేవాళ్లం. మేము ఇల్లు మారాం. అప్పుడప్పుడూ కనపడుతుండేవాడు అతను. ఇంతలో ఆమె వెనక్కి వెళ్లిపోతున్నది అని మా ఆవిడ చెప్పింది. అదేంటి మొన్ననేగా వెళ్లొచ్చింది, అయినా వెళ్లిపోవటం అంటే ఏంటి అని అడిగితే, వాళ్లు విడిపోతున్నారు. విడాకులు మంజూరు కూడా అయినయ్ అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కుటుంబంతో పెద్దగా నాకు పరిచయం లేకపోయినా వాళ్లని అంత దగ్గరగా గమనించకపోయినా, విడిపోయ్యేంత ఏముందా అని అనిపించి, అదేంటి, దేనికి? ఏమైనా కారణమా అని అడిగితే, ఇలా చెప్పుకొచ్చింది.
అతను ఆమెని అనుమానిస్తున్నాడట. అనుమాననించటామేకాక, అవమానిస్తున్నాడట. పుట్టిన పిల్ల అతనికి పుట్టింది కాదట. ఆమె పిల్లని పడుకోబెట్టి బాత్రూమ్ కో వెళ్తే ఆ పసిపిల్ల చేతిలో కత్తో, కత్తెరో పెడుతున్నాడట. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరితో ఆమెకు సంబంధం ఉందీ అంటాడట. అందుకే ఆమె విసిగి వేసారిపోయి వెళ్లిపోతున్నదీ.

నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడు చదువుకున్నోడే, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంగితం ఉన్నోడేనా అనిపించింది. మనిషి, ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచాన్ని జయించినా తనకున్న కొన్ని గుణాలని సరిచేస్కోలేడు, వాటిల్లో ముఖ్యమైనది తనకన్నా తక్కువ వాళ్లపై పెత్తనం చలాయించాలని చూడటం, వాళ్ల మూలాలపై దెబ్బకొట్టడం. గమ్మత్తేంటంటే, మనం, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పనిచేస్తూ పనిచేసే కంపెనీకి, క్యూ.ఏ, ఆడిట్ ప్రాసెస్, క్యూ.సి, ఐ.యస్.ఓ 9000, ఐ.యస్.ఓ 9001, ప్రాసెస్ ఓరియంటేషన్, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ అవి ఇవీ మట్టీ మషాణం, సిక్స్ సిగ్మా, సి.యం.యం.ఐ లెవెల్ స్టాండర్డ్స్ ఇలా పాటిస్తూ మిగతావారితో గొప్పగానో లేక వెటకారంగానో "బాసూ!! మా కంపెనీ సిక్సు సిగ్మా" అని చెప్పుకుంటాం. ఇవన్నీ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చెయ్యటానికీ అని చెప్తాం. మన నిజ జీవితంలో మచ్చుకి ఒక్క స్టాండర్డ్ని కూడా దత్తత తీస్కోం. చాలా ఆశ్చర్యంగా అనిపిసూంటుంది నాకు. అమెరికాకి వచ్చి, ఒక పెద్ద ప్రభుత్వకార్యాలయంలో ఐ.టీ గుత్తేదారుగా పనిచేస్తూ "పెళ్ళాం శీలాన్ని" తూలనాడటం "మనిషి" అనే పదానికే అవమానం. అదీ పసిపిల్లకి చేతిలో కత్తులు పెట్టి ఆడించటం అనేది మోస్ట్ ఇన్-హ్యూమన్. ఆమే అతన్ని దేనికి వదిలేసిందో కానీ 911 కి కాల్ చేసి ఉండాల్సింది. ఇలా చెయ్యటం నేరం, ఇట్స్ ఏ క్రైం.

ఇక్కడి విషయం ఏంటంటే, దేనికి మగాడు ఎప్పుడూ ఆడదాని శీలాన్నే దెబ్బకొడతాడూ అని? ఆమె అంటే ఇష్టంలేకపోతే, అమ్మాయి, నీకు నాకు సరిపోవటంలేదు, మనం విడిపోదాం, అని గౌరవంగా చెప్పుకోవచ్చుగా? నేను ఇటు అంటే నువ్వు అటు, నేను అ అంటే నువ్వు క. కాబట్టి నీకూ నాకు సరిపడదు. బెట్టర్ సపరేట్ అని చెప్పుకోవచ్చుగా? ఇలా నీకూ పలానోడికి లింకు ఉంది, విడిపోవాల్సిందే అనే కాన్సెప్ట్ దేనికి?

ఈరోజు రేపట్లో విడిపోవటం ఓ పెద్ద విషయం ఏమీ కాదు. అయితే మనం ఇలాంటి "విడాకుల్ని" ఇప్పుడిప్పుడే ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా మన సమాజం "విడాకుల్ని" అంగీకరీంచటంలేదు. చర్చ "విడిపోవడం" కన్నా, ఈ విడిపోయే వాళ్ల కారణాల మీద.

నాకు తెలిసి, ఈ రోజున విడిపోతున్న జంటలు చూపుతున్న ముఖ్య కారణం -
అబ్బాయి అమ్మాయి శీలాన్ని శంకించడమే.
అమ్మాయిలు కూడా అబ్బాయి శీలాన్ని శంకించడమే.


ఇంక ఇంతకన్నా వేరే కారణాలే దొరకవా జనాలకీ?
ఇక ముందుముందు ఎలా ఉండబోతోందో.
పడమటి దేశాల్లో ఎక్కువ మందికి తమ తండ్రి ఎవ్వరో తెలియదు. ఇలాంటి వాళ్లలో నల్లవాళ్లు ఎక్కువే. వాళ్ల జీవితాలు నేరమయం కావటానికి "తల్లిలేమి" "తండ్రిలేమి" "ప్రేమలేమి" "మారు తండ్రి హింస" ఇలాంటివి ముఖ్యమైన కారణాలు అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దేశంలో కూడా నెమ్మదిగా సింగిల్ పేరెంట్ పిల్లలు పెరుగబోతున్నారేమో?
నా దృష్టిలో -
వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేద్దాం అనేది శుద్ధ తప్పు మాట. అలాచేస్తే, ఒక్క నిజం చాలు ఆ సంసారాన్ని కూలగొట్టటానికి.
పెళ్లికి ముందు ఇద్దరికీ కౌన్సిలింగు చాలా అవసరం. ఈరోజూ రేపట్లో ఇది చాలా ముఖ్యం. అస్సలు పిల్లలు పెళ్లికి తయ్యారయ్యారా లేదా అని తల్లితండ్రులు తెల్సుకోవాలి. పెళ్లికి కావాలింది వయ్యసే కాదు, వయ్యస్సుతోబాటు వ్యక్తిత్వం, పెళ్లి చెసుకునేందుకు కావాల్సిన మానసిక స్థితి.

Feb 23, 2009

రుద్ర హోమం

ఈరోజు అనగా ఆదివారం, 23 Feb, మా ఊళ్లో శివరాత్రి చేసుకున్నాం. మా గుళ్లో ఈరోజు చాలా కార్యక్రమాల సమాహారం సిద్ధం చేసారు.

పొద్దున్నే ఆరుకే కార్యక్రమాలు మొదలు.
8-11 గణపతి హోమం
11-1 రుద్ర హోమం
దేనికి వెళ్దాం అని ఊగిసలాడి, రుద్ర హోమానికి వెళ్దాం అని నిర్ణయించి, కారు తీసా. సరిగ్గా పదకుండింతికి చేరుకున్నా. మాకు గుడి చాలా దూరం, రెండు మైళ్లే. వెళ్లేసరికి హడావిడిగా ఉంది గుడి. అయ్యవారికి అలంకరణ అవీ ఇవీ, కలశపూజా అన్నీ అయ్యాయి. ఇక, హోమానికి మొదలుపెడుతున్నారు. భాస్కరా, రా కూర్చో అన్నారు పూజారి గారు, కోఆర్డినేటరు శాస్త్రిగారు. అందరూ మనకి తెలిసినవారే.
ఇక కార్యక్రమం మొదలు. నా జీవితింలో రుద్రహోమం చెయ్యటం ఇదే మొట్టమొదటి సారి. బ్రహ్మాండంగా జరిగింది. రుద్రంలోని ప్రతీ మంత్రంతో ఇలా -
ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమ: స్వాహా"
అంటూ హోమం చెయ్యటం, ఆ మంత్రోఛారణలో నా గొంతూ కలవటం, అయ్యాక, అందరం ముక్తకంఠంతో వెయ్యిఎనిమిది సార్లు శివబీజాక్షరీ జపించటం మరోవైపు ఆమంత్రతోఛారణతో హోమం, అయ్యాక, పూర్ణాహుతి, మహా మంత్రపుష్పం, శాంతిమంత్రం. నారోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈరోజు.
ఇదంతా నా ఆర్.సి.యే వాయిస్ రికార్డర్లోకి రికార్డ్ చేసా. కానీ ఎందుకో సరిగ్గా రికార్డ్ కాలా. చివరకొచ్చేసరికి బ్యాటరీ అయిపోయింది. అందరితో పంచుకుందాం అనే నా ఆనందంమీద నీళ్లు జల్లిందీ వాల్మార్టు సరుకు.
ఏమైనా, చాలా తృప్తిగా ఉందీరోజు.
నా ఫోనుతో తీసిన హోమ గుండం ఇక్కడ పెడుతున్నా.




మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ భోళాశంకరుని చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుంటా.

గమనిక:- http://www.geocities.com/yajur.veda/ ఈ లింకులో రుద్రం స్వరసహితం లభిస్తుంది.

Feb 19, 2009

ఈ రోజెక్కడికి వెళ్దాం నాన్నా

అవును, మనం పుట్టినప్పటినుండీ మన తల్లితండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమించి, మన తొలిఅడుగు, తొలిమెతుకు, తొలిపలుకు ఇలా ప్రతీ దాంతో పులకించి, మనకి ప్రతీ అవసరంలో ఆసరాగా నిలిచి, మన ముందడుక్కి తమ కాయకష్టంతో తడిపిన ఇటుకల్తో బాటనేర్పాటు చేసి, తమ ఓర్పుని చీపిరిగా చేసి ఆ బాటలోని ముళ్లన్నిటినీ ఊడ్చి మనల్ని ఇంత ఎత్తుకి తెచ్చారు. మా నాన్న కూడా మా కోసం సైకిలు బుట్టలో ప్రతీరోజూ ఏదోక పదార్ధం తెచ్చేవాడు. సైకిలు మీద నేను ముందు నా అన్న వెనక కూర్చుంటే సినిమాకి తీస్కెళ్లేవాడు. పిడుగురాళ్ల లో ఉండి మేము షోలే, 36 ఛాంబర్ ఆఫ్ షావొలిన్, ఎంటర్ ది డ్రాగెన్, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. మా నాన్న అమ్మ తమ సర్వస్వాన్ని ఒడ్డి మాకు చదువులు చెప్పించారు. అయితే ఇది అందరు తల్లితండ్రులు చేసేదేగా. దానికి నా జవాబు, ఈ ప్రపంచంలో ఏ ఒక్కడి తల్లితండ్రులూ సమానంకాదు. ఏ ఇద్దరు తల్లులకూ నొప్పులు సమానంగా ఉండవు. ఎవడికి వాడికి వాడి తల్లితండ్రులు గొప్ప. This is a rule of thumb. ప్రపంచంలో మనకి అత్యంత విలువైన వ్యక్తులు ముగ్గురు. తల్లి, తండ్రి, గురువు. ఆ తర్వాతే సంసారం, పెళ్లాం, పిల్లలు అందరూ.

ఇంతకీ నేచెప్పొచ్చేదేంటంటే. ఈ కధని:

నేను ఎదో చదువుకున్నా. కొన్ని సార్లు ముందుకెళ్లా, కొన్ని సార్లు వెనక్కొచ్చా, కొన్ని సార్లు కిందపడ్డ కొన్ని సార్లు లేచి నుంచున్నా. అన్నిట్లో నా వెనక మా నాన్న ఉన్నాడు. ఆయన నా కోసం చేసిన త్యాగాలు కోకొల్లలు. బయట టీ తాక్కుండా ఆ రూపాయి మిగిల్చి నాకు బిస్కెట్టు కొనిపెట్టాడు. తాను రోడ్డుమీద వెళుతూ బజ్జీల కొట్టు ముందునుండే వెళ్తూ, ఆక్కుండా, ఇంటికి వచ్చి చద్దన్నం తిని గొక్కెడు నీళ్లు తాగి ఓ రూపాయిని ముంతలో ఏసాడు నాకోసం, పెన్సిలు కొనిపెట్టొచ్చు ఆ రూపాయితో తర్వాత అని. తాను సైకిలు తొక్కుతూ నన్ను తిప్పాడు, బండి కొంటే ఖర్చు అని. ఇలా ఎన్నో కష్టాలు పడి నన్ను పైకి ఎక్కదీస్కొచ్చిన నా కన్న తండ్రికి నేనేమి చేసాను?

ఈ పూట ఎక్కడికి పోదాం నాన్నా అని అడిగా. నా దగ్గరకి రా నాన్నా అని టికెట్లు పంపించా. రైల్ స్టేషన్ నుండి కార్ పెట్టుకుని ఇంటికి తీస్కొచ్చా. మద్రాసు మొత్తం తిప్పా. ప్రతీరోజు సాయత్రం ఆఫీసు నుండి తొందరగా ఇంటికి వచ్చి ఓ 5 నిమిషాలు అలా బయటకి తిప్పా. చేతిలో చెయ్యి పెట్టి నాన్నా నేను కొనుక్కున్న బండి అని చూపించా. నాన్నా నేను అద్దెకు తీస్కున్న ఇల్లు అని చూపించా. వారాంతాలు బీచుకి తీస్కెళ్లా. ఓ సాయంత్రం బిసెంటునగర్ బీచ్కి వెళ్తే, ఇంకోసాయంత్రం మెరీనా బీచ్కి తీస్కెళ్లా. ఓ పూట శర్వణాభవన్ లో కాఫీ తాగితే ఇంకోపూట కేఫ్ కఫీ డే లో తాగించా. ఓ రోజు బీసెంటు నగర్లో జ్యూస్ తాగితే ఇంకోరోజు సంగీతలో టిఫ్ఫిన్ పెట్టించా. ఓ వారంతం స్పెన్సర్ ప్లాజాకి తీస్కెళ్తే, ఓ వారంతం లైఫ్స్టైల్ కి తీస్కెళ్లా.
ఓ వారాంతం బీసెంటునగర్ లోని బట్టల కొట్టుకి తోస్కెళ్తే, ఇంకోవారంతం నుంగంబాక్కం ఎత్తురోడ్డులోని బట్టలకొట్టుకి తీస్కెళ్లా. మేము కొనేదేమి ఉండదు. సరదాగా అలా వెళ్లి, విండోషాపింగు చెయ్యటమే. ఇలా మేము తిరగని ప్రదేశం అంటు లేదు. ఊర్కనే అలా వెళ్లటం, ఓ చుట్టు చుట్టుకునిట్టి రావటం. అలానే కాపాలేశ్వరస్వామి గుడికి వెళ్లటం, మైలాపూర్లోని సాయిబాబా మందిరానికి వెళ్లటం. ఇలా.
నేను హైదరాబాద్లో ఉన్నప్పుడూ అంతే.

ఇక్కడి మూల కధ ఏంటంటే, నేను గొప్ప అని కాదు, నేను మాత్రమే ఇలా చేసా అని కాదు. ఇది కేవలం ఉదాహరణకి మాత్రమే.
గమనించాల్సిన అసలు విషయం - "కన్న తల్లితండ్రుల" కళ్లల్లో తృప్తి. నాన్నా, నేను కారు కొన్నా, అని ఆయన చెతిలో చేయివేసి ముందటి డోరు తీసి ఆకారులో కూర్చోబెట్టి, డోరు మూసేసి, డ్రైవింగు సీట్లో కూర్చొని ఇది ఇది, ఇది అది అని చెప్తూ ఈ పూట ఎక్కడికి వెళ్దాం అని అడిగినప్పుడు ఆ తండ్రికి కలిగే తృప్తి.

నాణానికి మరోవైపు : ఉద్యోగ వత్తిడిలో, అంబరాన్ని తాకాలనే తపనలో, ఆకాశానికి నిచ్చనేసి, పెళ్లాన్ని సుఖపెట్టటమే పరమావధిగా భావించి, అత్తమామలకి భజన చేస్తూ సొంత తల్లితండ్రుల్ని అవమానిస్తూన్న మనం, రేపు మనకి జరిగే ప్రమాదాన్నిగూర్చిన ఆలోచన లేకపోవటం. రేపొద్దున రాబోయే కొమ్ములు వాడి.

Feb 14, 2009

మన పెన్నులు

మాది టీచర్ల కుటుంబం. మా నాన్న జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో లెక్కల, మరియూ ఆంగ్ల స్కూల్ అస్సిస్టెంటుగా చేసారు. నాకు ఊహ వచ్చేప్పటికీ పిడుగురాళ్లలో ఉండే వాళ్లం, నేను పుట్టింది దాచేపల్లిలో మా తాతగారి ఇంట్లో పడమటిగదిలో అయినప్పటికీ.
పిడుగురాళ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, అ.క.అ ఎత్తుబడి పల్నాడులోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటి. ఇది ఇప్పటి మాట కాదు, పంతొందొందలదెభైలల్లో. అప్పటిరోజుల్లోనే ఆ ఎత్తుబళ్లో తొమ్మిదొందలమంది పిల్లలు చదువుకునేవారు ప్రతీ సంవత్సరం సరాసరి. మరి ప్రభుత్వ పాఠశాల కావటంవల్లనేమో ఎప్పుడూ ఉపాధ్యాయుల కొరత ఉంటూఉండేది. కాబట్టి ఉన్నవాళ్ల మీద అధిక వత్తిడి మామూలే. నాకు గుర్తిండి, ప్రతీ మూడు నెలలకూ ఓ పెద్ద కట్ట యూనిట్ పరీక్షల పేపర్లతో మా నాన్న సైకిలు బుట్ట నిండిపొయ్యి వచ్చేది. మాకేమైన తినుబండారాలు తెచ్చారేమో అనుకుని చెయ్యిపెడితే ఈ కాయితాలు తగులుతుండేవి పరీక్షల సీజనులో. ఇక క్వార్టర్లీ, హాప్యర్లీ, సంవత్సర పరీక్షలు మామూలే. మా నాన్న పాలసీ, వెంటనే దిద్దేసి ఇవ్వటం. ఈపూట పరీక్ష అయిపోతే మర్రోజుకల్లా ఇచ్చేయాలి మార్కులు.
మా ఇంట్లో "నర్సరావుపేట కుర్చి" ఒకటిండేది. ఆ కుర్చీకి, కుర్చీలో పడుకుని కాళ్లు పైకి పెట్టుకోటానికి రెండువైపులా, పొడుగ్గా చెక్కలు ఉంటాయి. వాటిని కుర్చీ చేతులు అనుకోవచ్చు. ఆ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటూ ఉండేది ఆ కుర్చి. నిద్ర రాకపోతే దాంట్లో కూర్చుంటే చాలు. కమ్మగా నిద్రవస్తుంది.
మా నాన్న దగ్గర ఓ పెద్ద చాలా బరువైన ప్లాంక్ ఉండేది. దాన్ని ఈ కుర్చీ చేతుల మీద పెట్టి చకా చకా దిద్దేవాళ్లు ఆ పేపర్లని మా నాన్న. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే దేంతో దిద్దే వాళ్లు అని? మళ్లీ కొంత ఉపోద్ఘాతం. మా చిన్నప్పుడు, నాల్గోతరగతి దాకా పలకే. అయిదునుండి ఇంగ్లీషు రాయటం మొదలు. నాలుగు రూళ్ల నోటు బుక్కు ఉండేది. మరి రాయటానికి ఏంటి?
ఇప్పట్లోలా అప్పట్లో బాల్పాయింటు పెన్నులు ఉండేవి కాదు. మరి? ఇంకుపెన్నులు. మా నాన్న దగ్గర "ప్రసాద్ కంపెని" వాళ్ల చెక్క పెన్నులు ఉండేవి. ఆమాటకొస్తే, బళ్లో రైటరు దగ్గరనుండి, పచారీకొట్టులో గుమాస్తా దాకా అందరూ ఈ చెక్కపెన్నుల్నే వాడే వాళ్లు. ఇవి ఒకరకమైన వాసనతో, రకరకాల సైజులతో ఉండేవి. మానాన్న దగ్గర ఇంతలావుది ఉండేది, మరి పరీక్షపేపర్లు దిద్దడానికి, ఒక్కసారి సిరా పోస్తే ఐదారొందల పేపర్లు మెత్తగా దిద్దుకుంటూ వెళ్లటమే. ఇక మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడివద్ద మూడు పెన్నులు జేబులో, నీలం సిరా, ఎర్ర సిరా, ఆకుపచ్చ సిరా. ఆకుపచ్చసిరా కేవలం గెజిటేడ్ ఆఫీసరు హోదా ఉన్నవాళ్లు మాత్రమే వాడుతుంటారు. మా నాన్న ప్రధానోపాధ్యాయుడు అయ్యాక నేనూ మా నాన్న బజారుకెళ్లి కొన్నాం. అయితే మానాన్న ఎప్పుడూ జేబులో పెట్టుకునే వాడు కాదు. దేనికంటే సిరా లీకు అవుతుందేమో అని. మానాన్న జేబులో ఎప్పుడూ జాటర్ రీఫిల్ పెన్ను ఉండేది మొట్టమొదటినుండి, అదేదో కంపెనీ పెన్ను. గుర్తు రావటంలేదు. ఇక బడిలో అప్పుడప్పుడూ సిరా పెన్నులోచి ముందున్నోడి చొక్కా మీదకెక్కుతుండేది. ఇక సంవత్సరాంత చివరి పరీక్షరోజున చొక్కా ఆంతా సిరానే. అప్పుడప్పుడూ పాళ్లీలు చిట్లిపోతుండేవి. బెంచీకేసి నిక్కటం, పాళీనీ తిప్పిరాయటం ఇలాంటివన్నీ మామూలే. ఆ రోజుల్లో పాళీ పావలా ఉండేది. ఇంకుపెన్నుతో రాస్తే చక్కటి చేతిరాత వస్తుంది. అలానే ఒకరు వాడిన ఇంకుపెన్ను ఇంకొకరి చేతిలో సరిగ్గా రాయకపోవచ్చు. కారణం, పాళీ ఒకలా అరిగిపోవడమే.

ఇంతకీ ఈ రాస్కొచ్చేది దేనిగురించంటే - "ప్రసాద్ కంపెని" చెక్కపెన్నుల గురించి.
నిన్ననో మొన్ననో గూగుల్లో వెతుకుతుంటే ఈ లింకు కనిపించింది. ఆ మొత్తాన్నీ తెలుగులోకి అనువదించేకన్నా, అక్కడకి వెళ్లి చదవటమే బాగుంటుంది.
టూకీగా:
ఈ ప్రసాద్ పెన్నులు తెనాలి లో తయ్యారవుతాయి. ప్రస్తుతానికి ఒక జైనుడు నడుపుతున్నాడు.
ఇక్కడ కొన్ని ఫోటోలు పెడుతున్నా పై లింకు నుండే, వీటిల్లో కొన్ని నాదగ్గర ఉన్నవే, గుంటూర్లో.....



పైమూడూ ఉన్నాయి నాదగ్గర



సాధారణంగా టీచర్లు, గుమాస్తాలు, రైటర్లూ వాడే పెన్నిలు ఈ పైవి. ఇవి కొంచెంపెద్ద పెన్నులు


మనం కోల్పోతున్న కనుమరుగౌతున్న ఇంకో మన లెగసి - సిరా పెన్నులు.
ఇప్పటికీ ఈ పెన్నులు గుంటూరులో కొన్ని దుకాణాల్లో మాత్రమే దొరుకుతున్నాయ్.

Feb 13, 2009

TV99 నిరంతర వార్తాస్రవంతి

మనం రోడ్ మీదవెళ్తూ ఉంటాం. ఒక కుక్కపిల్ల కాలువిరిగి కుంటుtUతుంది.
మనకి టైంఉంటే ఆగి దానికి ఏమికావాలో చూస్తాం, లేదు అంటే అయ్యోపాపం అని జాలిపడి వెళ్ళిపోతాం..
అదే TV99 రిపోర్టర్ ఏంచేస్తాడూ?
వెంటనే Tv99 ఆఫీసుకి ఒక ఫోన్ వెళ్తుంది, ఒఫీసోడు కెమెరామన్ ని పంపుతాడు.ఇక మొదలు ........
కృష్ణా ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?
ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుతుంది ......రాధా
అక్కడి వాళ్ళు ఎమన్నా చెబుతున్నారా?...కృష్ణా
రాధా...ఇక్కడి వాళ్లు ఇది ఒక మంచి కుక్క అని , దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతంలో ఈకుక్క ఈ ఏరియా లో ఇలా కుంటలేదని , ఇదే తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు. ......రాధా
కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది ? .....కృష్ణా
కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న . ఈ విధంగా కాలుకు దెబ్బతగలటం కొత్త అనుకుంట, అందుకే కున్టటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటానికి ప్రయత్నిచిన అది సమాధానం చెప్పకుండా మూలుగుతూంది ......రాధా
థాంక్స్ కృష్ణా , ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తూ ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ అందించిన వివరాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ .. తర్వాత కుక్కలు - కుంటుడు అనే అంశం పై చర్చింటానికి ప్రముఖ డాక్టర్ కుక్కుటేశ్వర రావు గారు మన స్టూడియో కి వస్తున్నారు.
బ్రేక్ .. తర్వాత
కాంత్ : చెప్పండి కుక్కుటేశ్వరరావుగారు గతంలో మీరుఎప్పుడైనా ఇలా కుక్కలు కుంటటం చూసారా? ఒక వేళ చూస్తే ఏ జాతి కుక్కలు కుంటటం చూసి ఉంటారు.
కుక్కుటేశ్వర రావు : ఈ విదంగా కుక్కలు కున్టటం ఇది మొదటి సారికాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లో ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయ్. కుంటటానికి జాతితో సంబంధం లేదు.
కాంత్ : అంటే కుక్కలు కుంటేప్పుడు వాటికి ఎమన్నా బాధ ఉంటుందా? ఉంటే ఎటువంటి బాధ ?
కుక్కుటేశ్వర రావు : బాధలో రకాలు ఉండవండి . కుంటేప్పుడు జనరల్గా దెబ్బ తగిన కాలుకి నొప్పి ఉంటుంది అని కుక్కల మెడికల్ సైన్సులో గట్టి ఆధారాలు ఉన్నాయ్.
కాంత్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి ..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.
కృష్ణ : (చెవిలో చివిమిషను పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు )
కృష్ణ చెప్పండి ..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది?
కృష్ణ : కాంత్ కుక్క మూలుగుతుంది , ఇప్పుడే బ్లూ క్రాస్ వాళ్ళు దానినితీసుకు వెళ్లారు.
కాంత్ : కుక్క కాలుకి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నాయ్ ?...కృష్ణా
కృష్ణ : కాంత్, కుక్క కాలుకి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకరగా ఉంది.
కాంత్ : వంకర అంటే ఎలా ఉంది ...కృష్ణ (ఇప్పుడు కాంత్ మొహంలో ఎప్రెషన్ ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ని ధ్వంసంచెయ్యటానికి వెయిట్ చేస్తున్న సోల్జెర్ర్ మొహంలో తప్ప)
కృష్ణ : కాంత్ వంకరగా అంటే చుట్టుకుని ఉంది, నేను అప్పటికి దానిని చక్కగా చెయ్యటానికి ట్రై చేస్తున్న కాని అది చుట్టుకుపోతోంది. బహుశా కాలుకి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దేశం.
కాంత్ : థాంక్స్ కృష్ణ ....కుక్కుటేశ్వర రావు గారు, కాలుకి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి కృష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?
కుక్కుటేశ్వర రావు : స్పందన అంటే ఏమి ఉంటుందితరా వెధవా...కుక్క కాలుకి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటిరా దేడ్ దిమాక్గా. ఏం మనిషివి రా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన ఆన్సర్లు చదివాను, ఇంక నా వల్ల కాదు , నా టీ మరిగిపోతూ ఉంటాయి. బంగారం లాంటి కొండయ్య అనే పేరు మార్చి కుక్కుటేశ్వర రావు అని మార్చి, షర్టు ప్యాంటు రెంట్కి తీసుకు వచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ నటించాలా? అల నటిస్తే నా టీ కొట్టు నుంచి ఎదురుగా ఉన్నా మీ TV99 ఆఫీసుకి రోజు 100 టీ ఆర్డర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందారా ఎదవ .. ఇలా తిడుతూ ఉండగానే, TV99 లోగో వచ్చి, మెరుగైన సమాజం కోసం చూసిచస్తూనే వుండండి TV99 అని వొచ్చి యాడ్స్ రావటం మొదలైంది..

నా మితృడు పంపిన మెయిల్ ఇది...:):)

Feb 11, 2009

2035

అది 2035 సమచ్చరం. మన దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. దేశం అంటే దేశం కాదుగానీ రాష్ట్రం. రాష్ట్రం అంటే రాష్ట్రం కాదుగాని అదో ఇదో తెలియని ఓ ప్రదేశం. అప్పటికి 25 జిల్లాల రాష్ట్రం 50 ముక్కలాయ, ఎవ్వనికి ఏది జిల్లానో, ఏది రాష్ట్రమో ఏది దేశమో, ఏది పెపంచమో గుర్తుండే తెలివి పోనేపోయ్యింది.

అప్పటికి ప్రతీ సమచ్చరం ఎలచ్చన్లు జనాలకి అలవాటాయిపొయినియ్. జనాలు ఇలా అనుకుంటూన్నరు "ఆ కాలంలో (1900, 2000లల్లో) ఐదు సమచ్చరాలకి ఓ పాలి ఎలచ్చన్లు జరిగినయ్యంటా" అని. సమచ్చరం సమచ్చరానికి కూటములు మారిపోతున్నయ్. 2034 గెల్చిన కూటామిలో ఉన్న పార్టీలు పభుత్వాన్ని ఇరగనూకి మళ్లీ ఎలచ్చన్ల కోశం ఎగబడుతున్నయ్. ఈసారి మాలమహానాడు ఏ, బీ, సీ, డీ, మాదిగదండోరా 1,2,3,8, కాపు 5,2,9,11, రెడ్డి 1,6,9, కుమ్మరి 23,45, వడ్డెర 5,12, రజక 1ఎ, 56డీ, గొల్లలు 23,45 బేపనోళ్లు 2,3,7 ఈళ్లందరూ ఓ కూటమి అయితే, మాలమహానాడు 4,5,6,7, కమ్మ 3,4,7ఇ,8క, రెడ్డి 89,78, ఇంకో కూటమి అయితే, మిగతావోళ్లు ఆళ్లకి చేతనైన కూటముల్లోజేరి ఎలచ్చన్లలో పోటీకి దిగుతున్నరు.
ఎలచ్చను కమీషనుకి సానా కష్టంగుండింది ఈతూలి. పార్టీలు పెరిగిపోయ, చాంతాడంతైనై వోటు పత్రాలు. ఎల్ట్రానిక్కు వోటు మిషన్లు పనిజెయ్యటంలా మరి బయిట 61 ఉండిందిగా వేడి. వోటు మిషన్లు ఈ సారికి ఒక్కోటి 50కేజీల బరువు ఉండిందాయా, మరి ఇన్ని పార్టీల గుర్తుల్ని సూపించాలిగా. 2037 సార్వర్త్రిక ఎలచ్చన్లకి స్పీచ్ రికొగ్నీషన్ తెస్తాం అని సెప్తుండే ఎలచ్చను కమీషను. అంటే, వోటేసే బోనులోకి పొయ్యి, నా వోటు పలానోడికి అని సెప్పలి. ఏదో కార్డుముక్క ఇస్తరంట, దానిపైన బారుకోడు ఉటదంట, ఆ వోటేసేబోనులోకెళ్లి యాడనో ఆ కార్డుముక్కనిబెట్టి గీకితే నువ్వు పలానా అనిచెపుద్దంట, నీవోటెవ్వాడికీ అని అడుగుతే పలానోడికి అనాలంట. మూణ్నిమిషాలు టైము, నువ్వు సెప్పకపోతే, అదే రూలింగు పార్టీవోడికే పోద్ది వోటు అనికూడా సెప్పుకుంటున్నరు జనాలు. బీరుబారులు ఇన్నంగానీ బారుకోడేందో!! పుచు!! కలికాలం ఇసాపట్ణం!! నల్గురితోపాటూ నాగలచ్చిమి. సేసేదేముంది. ఈ మరని ఎట్టా ట్యాంపర్ జెయ్యొచ్చు అని పార్టీలు ఆలోచన కూడా మొదలుబెట్టినయి అప్పుడె.
టీవీషోలు, పాడ్టీవీ షోలు వీడియోకాస్టుల్లో ఓ అని ఊదరకొడుతున్నరు ఎలచ్చన్లలో నిలబడేటోళ్లు. పతీ కూటమి పలాని కూటమి ఇంకో కూటమికి వోటేయొద్దు ఏసిన్రో ఇంకమీరు జచ్చిన్రే అని చెప్తుండింది. 2034 సమచ్చరం ఎలచ్చన్ల వోటూ శాతం 41. గెల్చినోడికి 11.5 శాతం పడినయ్ వోట్లు. మిగతావి మిగిల్నోళ్లు పంచుకున్నరు. అది ఈ పేరు ఊరు తెలియని దేశ/రాష్ట్ర/ప్రాంత 5సమచ్చరాల వోటు సరిత్రలో రికార్డంట.
మరి ఈతూలి ఎట్టుంటదో? ఎందుకింత వోటు శాతం పడిపోతున్నదీ అని ఓ కమీషన్నేసిన్రంట ఎలచ్చను కమీషనోళ్లు. సదువుకున్న కుఱ్ఱకారంతా ఆఫ్రికాకి, అరబ్బు రష్యా దేశాలకి వలసపోతున్నరని తేలిందంని వార్త. అదేందది, అక్కడకూడా జనాలున్నారుగా అని ఓ తెలివితక్కూవోడు అడుగుతుంటె ఓ తెలివైనోడు మూడో పెపంచ యుద్ధంలో అమెరికా సంకీర్ణసేన ఆదేశాలన్నిట్నీ కొల్లగొట్టిందిగా, ఇంకెవ్వరు మిగిలిన్రక్కడా? అందుకే మనోళ్లు అక్కడకి జారుకుంటుంన్నరు అని చెప్తుంటే నే ఇన్నా. మరి ఆ పొయ్యేదేదో అమెరికానే పోవచ్చుగా అన్నడింకో తెలివితక్కువోడు. అక్కడేం మిగిలింది న్యూక్లియర్ రేడియేషను తప్ప అంటున్నడూ ఆ తెలివైనోడు. ఏందో అంతా గోలగోలగుండింది బతుకు.

(...................అసంపూర్ణం)

Feb 8, 2009

స్వేఛ

ఈ ప్రపంచంలో ప్రతీవోడు స్వేఛా ప్రాణే, పక్కనోళ్లకి ఇబ్బంది కలగనంతవరకూ. పక్కనోళ్లకి ఇబ్బందికలుగుతుంది అని తెల్సినా, వాళ్లని ఇబ్బంది పెడదాం అనే స్వేఛ ని స్వేఛ అనం. దానికి దాని "డిగ్రీ" ని బట్టి పేర్లుపెడతాం. నేనో స్వేఛా జీవిని, కాబట్టి పాకిస్థాన్ వెళ్తా, టెర్రరిజం నేర్చుకునివచ్చి నీ స్వేఛని "తెలిసి" హరిస్తా, నీ మీద బాంబేస్తా అనేది "తీవ్రవాదం". నేను బలవంతుణ్ని, నేను మాత్రమే స్వేఛని అనుభవించాలి నువ్వు నా కాలికింద పడుండాలీ అనే స్వేఛ "బలుపువాదం". నక్సలైట్లు ఇట్టాంటోళ్లని కుక్కల్ని కాల్చినట్టు కాల్చారు మన చరిత్రలో.
ఐతే ఇక్కడ పాయింటేంటాంటే, నా బ్లాగు నాఇష్టం, నాకు స్వేఛ, నా ఇష్టంవచ్చినట్టు రాస్తా. రాస్కో, ఎవడొద్దంటాడు. రాస్కో, పలనావాడు ఎదవ - అది నీ ఉద్యోగం కాదు, నీకు సంబంధించిది కాదు.
పలానా ఆమె అప్పడాలుచేస్కుని అమ్ముకుంటుంది - అది నీకనవసరం.
బ్లాగుల్లో గుంపులున్నాయ్ - అవును, ఉంటే నీకేంటి, నీపని నువ్వుజూస్కో.
ఒకళ్లనొకళ్లు ముఖాముఖీలు జేస్కుంటున్నారు - చేస్కోనీవయ్యా? చేస్కోనీ.
ఆమె కధ రాసింది - నీకు ఇష్టమైతే చదువు, లేకపోతే, కుడిచెయ్యి వైపు పైన ఒక "x" ఉంటుంది అది నొక్కు, మూస్కుంటుంది నీ బ్రౌజరు.
ఇంత చిన్న విషయానికి వ్యక్తిగతంగా బూతులు దేనికి?

ముక్కుసూటిగా మాట్టాడ్టం అంటే నోటికి మెదడుకీ సంబంధంలేకుండా మాట్టాట్టం కాదు. నిజాయితీ అంటే నీలో నిజాయితీ అని, సమాజంలో నిజాయితీ అనికాదుగా. ముందు నువ్వు నిజాయితీ పరుడివాకాదా అనేది తెల్సుకో. నీ నిజాయితీ ఎంటో చెప్పు. పక్కనోడు ఒంటేలుకెళ్లి ఏంజేసాడో నీకుదేనికి? అంటే దొంగతనంగా చూస్తున్నావా? దాన్నే నిజాయితీ ఆంటారా? భజన పరులను నీ దెగ్గర చేర్చుకోకు. ఇంకొకళ్ల భజన బృందంతో నీకేంపని? నువ్వేమైనా సంఘసంస్కర్తవా?

నువ్వు నాకొడకా అంటే నేనూ నాకొడక అంటానికి ఎంతోసేపు పట్టదుగా. సమీకరణం చాలా వీజీ. అనకు, అనిపించుకోకు. పలానామె బ్లాగు హిట్లు పెంచుకోటానికి ఎదో రాసింది. నువ్వు మహాభారతం రాస్తున్నావా మరీ? అక్కడ ఉపయోగపడే వస్తువైనా ఉంది నువ్వు రాసిందు బూతు, దానికో రంగు - ముక్కుసూటి, నిజాయితీ.

ఏమైనా చెప్పేది ఒక్కటే ఎవ్వడికైనా, నాకైనా - ఇంకోళ్ల ముడ్డి కింద నలుపు చూపించే ముందు, నీ ముడ్దికిందనలుపు తెల్సుకో.

నలుగురు ఆడోళ్లపైన నువ్వు నీ నిజాయితీ భూతద్దంలోంచి చూసిన బూతుసినిమా కధని విసరంగనే నువ్వేమీ ఓ పెద్ద "కనిపెట్టినోడి"వేంకాలా.

గమనిక :- ఇక్కడ కామేంట్లు రాసేవాళ్లు నా నిజాయితీని గురించి కానీ, నా పనిని గురించికానీ, నాకెన్ని బ్లాగులున్నాయ్ ఇట్టాంటి మాటలు రాసేపనైతే కామెంటు పెట్టాల్సిన పనిలేదు. దానిబదులు ఈ పనిచేస్కోవచ్చు - పు.ఏ.పె.వాసన చూస్కోవచ్చు మహదానందంగా.

Feb 4, 2009

శ్రీ ఆది శంకరాచార్య - ప్రతి సంగ్రహం (A Brief Transcript)

ప్రతి సంగ్రహం (A Brief Transcript):
ప్రణవ గాయత్రీ మంత్రంతో సినిమా టైటిల్ల్స్ పడతాయి.
ముమూక్షువులు సంధ్యావందనం ఆచరిస్తూంటారు, సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తూంటారు.
मित्रस्य चर्षणी धॄत: श्रवो देवस्य सानसिम् । सत्यं चित्रश्रवस्तमम्॥
మిత్రస్య చర్షణీ దృత: శ్రవో దేవస్య సానసిం।
సత్యం చిత్ర్రశ్రవస్తవం ॥
[ఋగ్వేదం ౩.౫౯.౬;కృష్ణయజుర్వేదం
౩.౪.౧౧.౫;౪.౧.౬.౩;శుక్లయజుర్వేదం ౧౧.౬౨]
मित्रो जनान् यातयति प्रजानन् मित्री दाधार पॄथिवीमुहद्यम्।
मित्र: कॄष्टीरनिमिषाभिचष्टे सत्याय हव्यं घॄतवद्विधेम॥
మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రో దాధార పృధివీముతద్యం।
మిత్ర: కృష్టీరనిమిషాభిచష్టె సత్యాయ హవ్యం ఘృతవద్విధెమ॥

[ఋగ్వేదం ౩.౫౯.౧]


మిగతా ఇక్కడ చదవండి