Jan 10, 2016

F*** వర్డ్

మొన్నీమధ్య ఏకస్థలబహుళసముదాయంలో ఓ దేశీ పిల్లాడు, సూరిగాడికన్నా ఓ ఏడాది పెద్దవాడు, పిల్లలతో ఆడుతూ ఓ బూతుకూత అలవోకగా కూసినాడు. వెనువెంటనే కొందరు పిల్లలు ఆ పిల్లాడి తల్లికి ఆ విషయాన్ని మోసుకెళ్ళినారు. సదరు తల్లిగారు ఇలా వాక్రుచ్చినారు"ఓహ్! అవునా! తప్పుకదూ! కానీ, కావలని అన్నాడా లేక ఊతపదంలా అన్నాడా? ఓహ్! ఊతపదంలా అన్నాడా! అయితే తేలిగ్గా తీసుకుని వెళ్ళి ఆడుకోండి పోండి".

అదే పిల్లాడు మరోరోజు ఇంకో పెద్ద కార్యక్రమంలో కలిసినప్పుడు ఇంకాస్త ముదిరిపోయి అబ్బాయిలంతా ఓ గదిలో ఆడుకోవాలన్నట్టుగా అబ్బాయిలందర్నీ ఓ గదిలోచి చేర్చి లోపల గడియబెట్టి ఆట్టం మొదలెట్టినారు. ఆడపిల్లలంతాజేరి ఆగదిలోకి వెళ్ళబోతే తలుపు తీయడు, తీసి నెట్టేస్తూ మళ్ళీ బూతికూత కూయనే కూసినాడు. ఈసారి వాడి సహవాసగాడు కూడా అదే పదం వాడట్టంతో ఆడపిల్లలంతా సదరు సహవాసగాడి తల్లికి చెప్పినారు.
సదరు పిల్లవాడి తల్లిగారు ఉత్తరభారతీయ వనితగారు ఇలా వాక్రుచ్చినారు "వాళ్ళు మగపిల్లలు. ఏవైనా అంటారు. ఆడపిల్లలు ఎందుకు అక్కడికి వెళ్ళినట్టూ?"
ఆశ్చర్యపోయాను. అవాక్కయ్యాను. బూతుపదం ఊతపదంగా మారటాన్ని ఆపని తల్లితండ్రులు కూడా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంలో ఉంటూ ఆడపిల్ల మగపిల్ల అని తేడా చూపించే తల్లితండ్రులు కూడా ఉన్నారు.
నా పక్కన కూర్చునే ఓ తెల్లవాడితో ఈ విషయం చర్చకుతెస్తే, వాడు వాడి పిల్లలు స్టుపిడ్ అనే పదాన్ని కూడా వాడటానికి వీలులేదంటూ చెప్పుకొచ్చాడు.
బూతుమాటని మాట్టాడకూడదని పిల్లవాణ్ణి సరిచేయాల్సిన అవసరం లేదా?


Jan 2, 2016

ఉత్కృష్ట సోమయాగం

జనవరి నెలలో ఉత్కృష్ట సోమయాగం జరుగనున్నది. శ్రౌత సంవర్ధనీ సభ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర కాప్రే గారి అధ్యక్షతన జ్యోతిరప్తోర్యామం - ఉత్కృష్ట సోమయాగం జనవరి ౧౯ నుండి ౨౪ వరకు,  ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో జరుగనున్నది. అవకాశం ఉన్నవాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలయందు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక పాల్గొనవలసిన కార్యక్రమం.

మేధావులు స్పందించాల్సిన సమయం

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: దేశరాజధాని నగరం దిల్లీలో సరి-బేసి సంఖ్య వాహన విధానం నేడు అమలు చేసినప్పటికీ కాలుష్య స్థాయి అధికంగానే ఉందని అధికారులు వెల్లడించారు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు దిల్లీలో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్‌ సంఖ్య వాహనాలు రోజు మార్చి రోజు తిరగాలనే నిబంధన అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈరోజు కూడా నగరంలో గాలి నాణ్యత చాలా ప్రమాదకర స్థాయిలోనే ఉందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(సఫార్‌) వెల్లడించింది. గాలిలో పర్టిక్యులేట్‌ మాటర్‌ స్థాయి ఎక్కువగా ఉండడం కాలుష్యం తగ్గలేదని చెబుతున్నారు.నిన్నటి నుంచి చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదని తెలిపారు.
అయితే సరి-బేసి విధానంతో సంబంధం లేకుండా సఫార్‌ డిసెంబరు 31న దిల్లీ నగరంలో కాలుష్యంగా అధికంగా పెరిగిందని వెల్లడించింది.నూతన సంవత్సర వేడుకల సంబరాలతో పాటు వాతావరణ పరస్థితుల వల్ల కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న కారణంగా గాలిలో కదలిక లేకపోవడంతో గాలిలో పర్టిక్యులేట్‌ మాటర్‌ స్థాయి పెరుగుతోందని దీని వల్ల మరికొద్ది రోజులో నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతుందని అధికారులు గురువారం తెలిపారు.
కాలుష్యం తగ్గాలంటే వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు వాతావరణం కూడా సహకరించాల్సి ఉంటుంది. ఈరోజు దిల్లీలో కేవలం బేసి సంఖ్య కార్లకు అనుమతి ఇస్తూ నిబంధనలు అమలు చేయడం వల్ల కాలుష్యం మాట అటుంచితే నగరంలో ట్రాఫిక్‌ సమస్య కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ప్రజారవాణాపై ఆధారపడుతున్నారు. అలాగే కార్‌పూలింగ్‌ (తాము వెళ్లే దారిలో కారులో ఇతరులను ఎక్కించుకోవడం)కు కూడా డిమాండ్‌ పెరిగింది. కార్‌పూలింగ్‌ యాప్స్‌ను అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానానికి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా మద్దతు ఇచ్చింది.
>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<

మేధావులు స్పందించాల్సిన సమయం. కాలుష్యరహిత నగరాలను చూడాలని నేను అనటంలేదు. కానీ, రాజధాని ప్రజలలో స్పూర్తి నింపాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉన్నదనటంలో ఏమాత్రమూ సందేహంలేదు. అటు ప్రభుత్వం ఇటు మేధావి వర్గం కలసి పనిచేసి దేశ రాజధానిని రక్షించాలని కోరుకుంటున్నాను

Jan 1, 2016

మాహిష్మతీ ముద్రాక్షర శాల, ముక్త్యాల

మాహిష్మతీ ముద్రాక్షర శాల, ముక్త్యాల