May 27, 2020

దేవుడి మాన్యం



కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభువులు బ్రాహ్మణికల్ యాటిట్యూడ్‌లో తడిసి ముద్దై గుళ్ళు, గుడి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కోసం మాన్యం, గుడికొక అర్చకుడు అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు.

కొన్ని శతాబ్దాలో దశాబ్దాలో నడిచాక పరాయి పాలకులు దేశాన్ని గుళ్ళను గుడి సంపదను దోచుకోగా మిగిలిన టాంజిబుల్ ప్రాపర్టీలని తమతో తీసుకెళ్ళలేక పాపం డీలాపడి, సదరు భూముల్ని ఎలా దోచుకోవాలా అని బాధపడ్డారు.

శతాబ్దాలు దశాబ్దాలు గడచాక నల్లదొరల పాలనలో దోచేవాడే పాలకుడు అయ్యాడు రాజకీయ వేత్త అయ్యాడు కాబట్టి దోపిడికి అడ్డు అదుపూ లేకుండా పోయింది.

దోచుకున్నోడికి దోచుకున్నంత అయ్యింది.

ఈ రాపిడిలో దోపిడిలో ఒరిపిడిలో ఎండ్లకాలం అమెరికన్ అమ్మాయి డ్రస్సు లాగా వేల ఎకరాలున్న దేవుడి మాన్యం కాస్త కురచై కురచై జానెడుకొచ్చింది.

ఇందులో తిలా పాపం తలా పిరికెడు.

చివరికి 2020వ సంవత్సరం ఓ పెద్దాయన -
ఆ ఫైలు ఇలా తే! స్వామి వారికి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఎవరెవరు ధారాదత్తం చేశారో చూద్దాం అన్నాడు.
ముందరి ప్రభుత్వ హయాంలో ఏసీ గదుల్లో కూర్చునే కొందరు బడాబాబులు "అబ్బే! వేస్ట్ భూమి. ఎందుకూ పనికిరాదు. అక్కడెక్కడో, మనకి దూరం గురూ కనీసం వెళ్ళి చూడను కూడా లేము, ఏ పాతిక సెంట్లో ఉంటే ఎవడు కాపాడతాట్టా" అన్నారు.

వాళ్ళని తప్పు పట్టలేం.

ఒకరకంగా చెబితే - భక్తులు ఇచ్చే భూమిని ట్రాక్ చేయటమూ కష్టమే, దాంట్లో అసాంఘీక కార్యకలాపాలు జరక్కుండా కాపు కాయటమూ కష్టమే.

ఇంతలో కొందరు మేధావులు - ఈ చిన్న చిన్న ముక్కలని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి, ఎక్స్ఛేంఝ్ ఆఫర్ కింద కన్సాలిడేటెడ్ గా ఓ పెద్ద ముక్క పొందవచ్చు కదా?

ఎగ్రీడ్. మంచి ఆలోచనే. అయినా కష్టమే.

సరే! ఏతావాతా - దేవుడికి భక్తులిచ్చిన భూమిని వదిలించుకోవటం అనకుండా - దాన్ని ఏదోరకంగా ప్రజలకే ఇస్తే అటు ప్రజలకూ ఉపయోగం. ఇటు కనిపించని ఆ దేవుడికి ఆనందం.

అయితే సమస్య - దీన్ని గురించిన రాజకీయం.
అమ్ముదాం అన్నది ఎవరూ?
ఇంతక ముంది ఎన్ని సార్లు అమ్మారు?
ఇప్పుడు అమ్మటానికి ప్రాతిపదిక ఎప్పటిదీ?

ఈ ప్రశ్నలు అడిగితే - మీరు సమస్యని డైల్యూట్ చేస్తున్నారు, జనాల వేడి మీద నీళ్ళు పోస్తున్నారు అంటున్నారు.
అడక్క పోతే - తిరుపతి కొండనే అమ్మేస్తారు దగుల్బాజీలు అంటున్నారు


దీనికి పరాకాష్ఠ - గుంటూరు రైల్వేస్టేషన్ని, గాంధీ పార్కునీ, దానిముందున్న కూరగాయల మార్కెట్టుని అమ్మేస్తున్నారట అని ప్రచారం.

ఎంతకి దిగజారిపోతున్నారో రాజకీయ నికృష్ఠులు అనిపించింది.

May 26, 2020

Beets



ఆ మధ్య బీట్స్ నాటినాను.
అవి ఇంతింతై అన్న చందంగా
మొత్తానికి ఇంత అయినయి

బీట్రూట్ కూర వీటితో చేసింది చాలా బాగుంది.

May 19, 2020

హిందూ దుకాణాలల్లో ఏమీ కొనొద్దు

ఇదెంతవరుకూ నిజమో తెలియదు.

బెంగుళూరులో హిందూ దుకాణాలల్లో ఏమీ కొనొద్దు అంటూ ఫత్వా జారీ అంటూ, కొందరు టపోరి ఉర్దూలో షాపింగ్ చేస్తున్న ముస్లిం ఆడవాళ్ళని అరవటం, మీకెన్నిసార్లు చెప్పాలీ అంటూ ఏదో అరుస్తున్న కొన్ని వీడియాలు సోకాల్డ్ మాధ్యమాలల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది నిజమా? నాకు తెలియదు. కానీ, నిజమైతే?

ఒక్క సలహా -
ముస్లిం దుకాణాలల్లో కొనటాన్ని త్యజించటమో
హిందూ దుకాణాలల్లో కొనటాన్ని త్యజించటమో కాదు

మేడ్ ఇన్ చైనాని త్యజించండి
విదేశి వస్త్రాన్ని త్యజించండి
విదేశీ ఆలోచనల్ని త్యజించండి

కనీసం మన ఆర్థిక వ్యవస్థన్నా బాగుపడుతుంది.
హిందూ దుకాణంలో కొనకుండా ఎంతకాలం జరుగుతుందీ? ముస్లిం దుకాణానికి వెళ్ళకుండా ఎలా ఈడుస్తారూ?

మీనింగ్‌లెస్ కథ

బ్రాహ్మణికల్ యాటిట్యూడ్

పొరపాటున చేయి తగిలి మత్తి కహేశ్ గారి బ్లాగుకి వెళ్ళబడ్డాను.
ఈయన బ్లాగంతా బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ తో పొంగి పొర్లుతుంటుంది.

నాదృష్టిలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అని ఇత్తు కత్తిరించాటానికి వచ్చినోణ్ణి కరిచే పందిలా గుణుస్తూ అరుస్తున్నోడికున్నంత బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు.

వెయ్యి ఏళ్ళ పరాయి పాలనలో వెన్ను విరిగిన విరచబడిన భారతదేశంలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ డైపర్లో పెంటికలు ఏరుకునే వారికి మాత్రమే కనిపిస్తుంది సదరు యాటిట్యూడ్.

ఛాలంజ్ అనే సినిమాలో రాం మోహన్ రావ్ గాంధీని "నీలాంటి దరిద్రులు" అని "అదేం తిట్టుకాదబ్బాయ్, నీలాంటి డబ్బులేని వాళ్ళని పిలిచే బిరుదు" అంటాడు. అలా మత్తి కహేశ్ లాంటోళ్ళు లుంగీ కీలయ్య లాంటి భావాలకి దాసులై మెళితిజాన్ని మత్తుగా తాగి టాస్ చేసిన పదమే బ్రాహ్మణికల్ యాటిట్యూడ్. అదేం తిట్టు కాదు అని బురిడి కొట్టించ బోతాడు మేతావి. అదేం కులానికి సంబంధించిన పదం అనుకుంటున్నావా వెర్రివాడా అని బెదిరిస్తాడూ. అసలు నీకు చరిత్ర తెలుసా అంటాడు.
పార్టీషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా అంటాడు.

ఇవన్ని కథలు. మేతావి తనాన్ని కుమ్మరించే ప్రయత్నాలు.
ఇంట్లో ఇద్దరుంటే ఒకడు చేసింది ఇంకోడు తప్పంటాడు.


ఇది కేవలం భావజాలానికి బానిసత్వమే.


By the way - I dont want to discover  what is such attitude. I will leave it to Matti Piggesh kind of intellectuals to define as there is no formal definition for such combo words

May 9, 2020

అచ్చెన్నాయుడూ


ఏంటయ్యా ఇదీ? కనీస నాలెడ్జ్ ఉండొద్దా?

1."ప్రమాదఘటనకు దారి తీసిన కారణాలను నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్రప్రభుత్వం విచారణ బృందం ఏర్పాటు చేయాలి."
బాగుంది.
ఎందుకుటా?
"రాష్ట్రప్రభుత్వం, సీయం జగన్ పట్ల మాకు, ప్రజలకూ నమ్మకం లేదు."
ఇదేవన్నా బాబు మిద దాడా లేక నీమీదనా?
ఏంటి గురూ నువ్వు మాట్టాడేదీ?
2. "ఎల్జీ పాలిమర్స్ లో తయ్యారయ్యే ముడి సరుకు ప్రభుత్వానికి సంబంధించిన కొందరు ముఖ్యులకు వెళ్తోంది"
గురూ. ఏం మాట్టాడుతున్నావ్? ఇదేవన్నా బంగారమా లేక తినేదా? అది స్టెరైన్. ఇంట్లో అంట్లు తోంకోటానికో లేక కూరల్లో వేస్కోటానికో లేక సారాయిలో కలపటానికో వాడరు.

రాజకీయం చేయి. వద్దనట్లేదు
నీ అస్థిత్వాన్ని చాటుకో. అదీ వద్దనటం లేదు.
సిల్లీగా స్టేట్మెంట్స్ ఇచ్చి నిన్ను నువ్వే పాతాళానికి నెట్టుకోకు. చంద్రబాబు కూడా నిన్ను కాపాడలేడు.

విశాఖ మిత్రులు

విశాఖలోని నా బ్లాగు చదివే మిత్రులు, 
యావన్మందీ మేలుతలుస్తా

May 6, 2020

#mahoorparvez



ఈమె ట్వీట్ ఎంత నిజమో నాకు తెలియదు. ఈమె నిజమైన వ్యక్తో లేక ఈమె ట్విటర్ హ్యాండిల్ ఒక బోట్ మేనేజ్ చేస్తుందో కూడా నాకు తెలియదు.

కశ్మీర్ భారత్ అంతర్భాగం. కాదనటానికి ఎవరికీ హక్కు లేదు, ఒమర్ అబ్దుల్లా/రాహు గాంధీతో సహా.

అక్కడ హింస సాగుతున్నది.
అయుండచ్చు.

ఉత్తి పుణ్యానికి ముస్లిములని ఊచకోత కోస్తున్నారు.
కొంత నిజం కూడా అయుండచ్చు.

వేర్పాటూ వాదానికి కొమ్ముకాస్తున్నవాళ్ళతో పాటు కొందరు పోతారు.
అది తప్పదు.

దేశాన్ని రక్షించే రక్షకభటులు కశ్మీరునీ రక్షించాలి.
వాళ్ళ ధర్మం అది.

కశ్మీరుని కాయటానికి చైనావాళ్ళని పెట్టలేం కదా?

బై ద వే - చైనా వాళ్ళూ ఏం గొప్పవాళ్ళు కాదు ఆమాటకొస్తే! లెఫ్టిస్టిక్ పార్టీలన్నీ ఓ చైనా అని రొమ్ములు బాదుకుంటారు. చైనీయులు టిబెట్ వేర్పాటువాదుల్ని ఎలా అణగతొక్కిందో వెతికితే దొరుకుతాయి.

కశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలంటే అనేక మార్గాలు ఉండచ్చు.
పోరాటం చేయొచ్చు.

కానీ ఇండియన్ ఆర్మీని తెగచంపటమే కాకుండా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్స్ ఇవ్వటం దిగజారుడుతనం.

ఇలాంటివాళ్ళని ఏమి చెయ్యాలీ?

వదిలేయాలా?

వీళ్ళకి ఇలాంటివి చెబుతున్న వాళ్ళని పట్టుకుని శిక్షించాలా?

ఎంత కాలం ఇలా?

ఇవన్ని పక్కనపెడితే - అసలు వీళ్ళకేంకావాలీ?

కశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలా?

కశ్మీర్ దేశం కావాలా?

కశ్మీర్ ని చైనాలో కలపాలా లేక కశ్మీర్ ని ఆఫ్ఘనిస్థాన్ లో కలపాలా?

చెప్పుడు మాటలు విని జీవితాలని నాశనం చేసుకునేవాళ్ళు కొందరు.

జనాల అమాయకత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసేవాళ్ళు కొందరు.

గోడకి అటువైపు ఇంద్రలోకం నవలోకం అని నమ్మే గొఱ్ఱెలు

దౌర్భాగ్యం

అంతులేని కథ....


May 5, 2020

వదంతులు


గత కొన్ని నెలలుగా భారతదేశం ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంది. వాటిల్లో ప్రధానమైనవి - ఆర్టికల్ 370/ సిఏఏ/ యన్.ఆర్.సి లపై హింసాయుత అల్లర్లు/ విముఖత.

ఒక సాధారణ పౌరుడికి ఇవి ఎంత వరకూ అర్థమయ్యాయో నాకు తెలియదు. ఒక సాధారణ పౌరుడికి వీటిని అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏంచేశాయో తెలియదు. వీటిని విడమరచి చెప్పే ప్రయత్నం ఎవరైనా చేశారో లేదో కూడా తెలియదు.

ప్రతీ వార్తా ఛానెల్లో పొద్దుటి నుంచి అర్థరాత్రి దాకా జరిగిన అర్థంలేని వేడి వేడి చర్చల్లో కొట్టుకోవటం పరస్పర నింద, ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టటం లాంటి - వ్యూవర్షిప్ ని పెంచుకునే కార్యక్రమాలే తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజాన్ని మాట్లాడిన చర్చాలేదు వార్తా ఛానలూ లేదు.

రాష్ట్ర పాలకులకే వీటిమీద సరైన అవగాహన లేదు. ఇంక సాధారణ పౌరులకి ఏం అవగహాన?

కోవిడ్ మొదలుతున్న రోజుల్లో ఇంట్లో ఏసి పని చేయటం మానేసంది. అమ్మా! ఎలాగూ ఇంకో 15 రోజుల్లో ప్రయాణం ఉందిగా అమెరికాకి. తిరిగి వెళ్ళినప్పుడు చూపిద్దువులే అన్నాను.
అలసత్వం మనిషికి మంచిది కాదని అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి, వాయిదా వేయటం మంచిది కాదని అనేక దృష్యాంతరాలున్నాయి మన పురాణ ఐతిహాసాల్లో.
మనం వినం కదా! మనుషులం కదా!

పాపం అమ్మ సరే అన్నది. ఇంతలో కోవిడ్ విజృంభణ, విమానాలు ఇంటికి వెళ్ళిపోవటం లాక్‌డౌన్ గట్రా అన్నీ కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయాయి.
నిన్న ఒకతను మొత్తానికి ఏసీ బాగుచేయటానికి వచ్చాడు.
మాటల్లో - ముస్లిములందరినీ భారత్ దేశం నుంచి పంపించేసి హిందూదేశంగా భారతదేశాన్ని మార్చాలని మోడి ప్రయత్నిస్తున్నాట్ట అండీ అంటాడు.

అమ్మ నాతో ఈ విషయం ప్రస్థావించినప్పుడు నాకు ఒక్క నిమిషం పాటు ఏం చెప్పాలో పాలుపోలేదు.

మూలాల్ని కలుషితం చేసే దౌర్భాగ్యులు తయ్యారైయ్యారు దేశంలో.

ఏంచెయ్యాలీ? ఏంచెప్పాలీ? ఎవర్ని మార్చాలి. ఎవరు మార్చాలి? ఎలా మార్చాలీ?

ఆందోళనకు గురి అయ్యాను.

వదంతులు వ్యాప్తి చేయకండి. మీకు అర్థమైతే విడమర్చి చెప్పండి. లేక పోతే అరవకుండా కూర్చోండి. తెలిసీ తెలియకుండా దేశాన్ని కలుషితం చేయకండి.

వాట్స్ యాప్‌లలో ఫేసుబుక్‌లలో చెత్త ఫార్వర్డ్ చేయకండి.

చూసిందంతా నిజం కాదు.

విన్నదంతా నిజం కాదు.

చెత్తని మోయకండి.

మీ చెత్త అభిప్రాయాల్ని పక్కన వాళ్ళ మీద రుద్ది వాళ్ళ జీవితాల్ని కడతేర్చకండి.

May 3, 2020

చెలియలి కట్ట నాటకం

ఆకాశవాణిలో చెలియలి కట్ట నాటికి వస్తున్నది

విశ్వనాథ రచన
వినదల్చుకున్నవాళ్ళు వినచ్చు


ఈ నవలకి ఒక నేపథ్యం ఉంది
తెవికి -
విశ్వనాథ సత్యనారాయణ 1935లో వ్రాసిన నవల. చలం వ్రాసిన మైదానం నవలను ఖండిస్తూ రాసిన నవలగా ఇది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఇది ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆపైన దాదాపుగా 12 ముద్రణలు పొంది ప్రాచుర్యమైనది.

https://te.m.wikipedia.org/వికి/చెలియలి_కట్ట

ఈమాటలో ఓ వ్యాసం
http://eemaata.com/em/issues/199907/1107.html

By the way - ఈ నాటకాన్ని ఇక్కడ వినచ్చు
https://archive.org/details/CheliyalikattaViswanathaSathyanarayana

May 1, 2020

ఈనాడు పేపర్ - ఇక లైఫ్ టైం బ్యాన్


ఈనాడు చదవటం మానేశాను. అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని కారణాలున్నాయి. ఒక వార్త సాక్షిలో ఎలా రాస్తాడు అదే వార్తని ఈనాడు ఎలా రాస్తాడు అని ఒక కోణం.
అనేక సందర్భాలల్లో రెండూ ఆపోజిట్ గారాస్తాయి. అంతకన్నా నేనేం ఆశించటం లేదు కూడా.
ఈనాడు తెదేపా భజన, చంద్రబాబుని నెత్తిన మొయ్యటం కూడా ఓ పెద్ద విషయం కాదు.
కానీ అప్పుడప్పుడూ శృతి మించి రాగాన పడుతుంటుంది పల్లకీ మోత.
అసహ్యం కలుగు తుంటుంది. అసహనానికి గురిచేస్తుంటుంది.

జర్నలిజం విలువలు అని దంచికొడతారు వేదికల మీద. ఇంటికెళ్ళి పల్లకీల మోత సేవ చేస్తుంటారు.

ఋషికపూర్ కాలం చేశాడు.
ఎవరెవరు సంతాపం తెలియజేశారో ఈనాడు లిస్ట్ వేశాడు
మొదట - ప్రధాని నరేంద్ర మోడి అన్నాడు.
రెండోది - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నాడు

ఆ విండోని క్లోజ్ చేశాను.
ఈనాడుని నేను ఎందుకు చదవాలీ? జవాబు దొరకలేదు.