May 26, 2011

ఈ వార్త చూసారా?

వార్త అటుంచితే, ఆ బొమ్మమాత్రం నన్ను కదిపేసింది. భారతదేశం కర్మభూమి, అదీ ఇదీ అని చెప్పుకోటానికే అని మరోమారు రుజువైంది.

ఆడపిల్లా.. అంతుచూస్తారు!
ఏ మాత్రం తగ్గని భ్రూణ హత్యలు
గర్భస్రావాలతో కడతేరుస్తున్న వైనం..
సంపన్నులు, విద్యావంతుల్లోనే ఎక్కువ
2011 లెక్కల్లో తగ్గిన బాలికలు
న్యూఢిల్లీ
డుపులో పడిన నలుసు ఆడపిల్లని తేలితే చాలు.. మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఈ దురాచారం మరింతగా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య క్రమంగా దక్షిణ భారత్‌లోనూ అదేస్థాయిలో విస్తరిస్తున్నట్లు వెల్లడైంది. ఆడపిల్ల అనే కారణంతో దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో 42 లక్షల నుంచి 1.21 కోట్ల గర్భస్రావాలు జరిగినట్లు తేలింది. తొలి సంతానంగా ఆడపిల్లను కలిగిన సంపన్నులు, విద్యావంతులు సైతం.. రెండోసారి గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు గుర్తిస్తే గర్భస్రావం చేయించుకున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ తరహా గర్భస్రావాలు 1980 నుంచి 2010 వరకూ 42 లక్షల నుంచి 1.21 కోట్ల దాకా జరిగి ఉంటాయని 'లాన్సెట్‌'లో ప్రచురించిన అధ్యయనంలో వివరించారు. బాలురు, బాలికల నిష్పత్తిలో సైతం గణనీయ మార్పులు వచ్చినట్లు నిర్ధరించారు. ఇలాంటి గర్భస్రావాలు సర్వసాధారణంగా జరిగే రాష్ట్రాల్లోనే దేశ జనాభా ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రభాత్‌ఝా తెలిపారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు జనగణన, జాతీయ సర్వేలను పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో బాలురతో పోలిస్తే 71 లక్షల బాలికలు తక్కువగా ఉన్నారు. 2001 జనాభా లెక్కల్లో 60 లక్షల మందే తక్కువగా ఉండగా తేడా గణనీయంగా పెరిగింది. కుమారుడే ఉండాలనే నిర్ణయం వల్లే ఇలా స్త్రీ పురుష నిష్పత్తిలో భారీ తేడాకు కారణమవుతోందని వివరించారు. అల్ట్రాసౌండ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రావడం, ఖర్చుపెట్టే సామర్థ్యం పెరగడం వంటివి ఇలాంటి గర్భస్రావాలకు కారణమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

అమెరికాలోనూ మారని మనవాళ్లు..
బోస్టన్‌: అమెరికాలో ప్రవాస భారతీయ మహిళలు సైతం.. కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు తేలితే గర్భస్రావాలు చేయించుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. కుటుంబ ఒత్తిడుల కారణంగానే ఈ పనికి ఒడిగడుతున్నట్లు తేలింది. భారత్‌లో మాదిరిగా కాకుండా లింగనిర్ధరణ పరీక్షలు అమెరికాలో చట్టబద్ధం కావడంతో ఈ పని మరింత తేలికవుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2004 నుంచి 2009 వరకు ఈ పరిశీలన చేపట్టారు. గర్భంలో ఆడబిడ్డ ఉన్నట్లు నిర్ధరణ జరిగినప్పుడు 40 శాతం మంది మహిళలు గర్భస్రావం చేయించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మహిళల్లో సగం మందికి ఉద్యోగాలు ఉండగా, చాలామంది ఉన్నత విద్యావంతులేనని తేలింది. గర్భంలో ఆడపిల్లను మోసే మహిళలు ఇళ్లలో తిట్లు, దెబ్బలకు గురవుతున్నట్లు గుర్తించారు. అత్త, భర్తల నుంచే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినవారూ ఉన్నారు.



May 10, 2011

పాప్ అప్ పుస్తకాలు

ఎప్పుడు గ్రంథాలయానికి వెళ్ళినా నాన్నా పాప్ అప్ పుస్తకాలు నాన్నా తీస్కుందాం నాన్నా అంటుంటాడు సూర్య. వద్దులేరా నాన్నా చెల్లి లాగేసి చింపేస్తే కష్టం కదా అని వారిస్తుంటాను. నిన్నటి వారాంతం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు, పద నాన్నా ప్లీజ్ అన్నాడు. సరేరా పదా అని పాప్ అప్ పుస్తకాల గదికి వెళ్ళాం.
అక్కడి లైబ్రేరియన్
"ఏం కావాలయ్యా"
"పాప్ అప్ పుస్తకాలు కావాల"
"తప్పకుండా. మావద్ద ఓ యాభై దాకా ఉన్నాయి పాప్ అప్ పుస్తకాలు"
"ఓహో ఏవిటీ మీ పాలసీ"
"ఇక్కడ కూర్చుని చక్కగా చూస్కుని తిరిగి ఇచ్చేసి వెళ్ళటమే పాలసి"
"ఓహ్ అలాగా"
సూరిగాడితో
"అరేయ్ ఇంటికి ఇవవ్వరుట, ఇక్కడే చూసి ఇచ్చేయాలట సరేనా"
ఆమెతో "హ్మ్ బాగుంది ఐతే ఏవేం పుస్తకాలున్నాయో చూపండి"
ఆమె పుస్తకాల గదికి దారితీసింది, వెనకాతలే మేమూ వెళ్ళాం
పాప్ అప్ పుస్తకాలు ఒక నిర్బంధ గదిలో ఉన్నాయి. తాళం తీసి లోపలకి ఆహ్వానించింది. ఒక అల్మరా మొత్తం అవే.
మనవాడి కళ్ళు మరి దేవుళ్ళాడే కళ్ళు కదా [సెర్చింగ్ ఐస్] వెనువెంటనే ఓ రెండు పుస్తకాలను ఇట్టే పట్టేసాడు. డైనోసరస్ పాప్ అప్ పుస్తకం, మరియూ అండర్ వాటర్ పాప్ అప్ పుస్తకం.
అన్న రెచ్చిపోతే చెల్లి వెనకడుగు వేస్తాయ్? నెవ్వర్
తింకబెల్ తింకబెల్ అన్నది. లైబ్రేరియన్ వెంటనే ఏదో ప్రిన్సెస్ పాప్ అప్ పుస్తకం ఇచ్చింది.
ఏమాటకామాట, పాప్ అప్ పుస్తకాలు తయ్యారు చేయటం అంత సుళువు కాదు. ఎంతో కళాత్మకత ఓర్పు అవసరం. వాడివద్ద రెండు మూడు పుస్తకాలు ఇంతక ముందే ఉన్నా ఇప్పుడు చూసినవి మాత్రం అత్భుతమైనవిలా తోచాయి
వాడి రెండు పుస్తకాలు కేరింతలు కొడుతూ చూసాడు. అయ్యాక ఇచ్చేసి పిల్లలపుస్తకాల గదివైపుకి నడిచాం అందరం
కొన్ని ఫోటోలు ఇవిగో

May 4, 2011

ఏవిటో ఈ వార్తలు, వార్తాపత్రికలు

నిన్న ఈనాడులో ఈవార్త నన్నాశ్చర్యపరిచింది. లాడేన్ని మట్టుబెట్టారన్న వార్తాపరంపరలో, అమెరికాలోని అందరూ పాకిస్థాన్నీ, పాకిస్థాన్లో లాడెన్ దొరకటాన్నీ ప్రశ్నిస్తుంటే, అలానే ఫరీద్ జకారియాని కూడా డిస్కషన్ లోకి లాగి ప్రశ్నిస్తుంటే ఈనాడు వాడేవిట్రా ఇలా రాసాడు అనుకున్నాను.

ఇక ఈరోజు వార్త
ల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌లాడెన్‌ పాకిస్థాన్‌ గడ్డపై హతమవడంతో ఇప్పుడు అందరి చూపులూ ఆ దేశంపైకే మరలాయి. అమెరికా సైతం అనుమానంగానే చూస్తోంది


ఏవిటీ ఈ వార్తాశ్రవంతులు? ఏవిటీ వీరి లక్ష్యాలు?
మొన్నటికి మొన్న ఇలా వేసాడు
అక్బరుద్దీన్‌ దాడిని ఖండించిన చంద్రబాబు
కడప: ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న అక్బరుద్దీన్‌పై దుండగులు దాడి జరపడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒవైసీపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

రెండు విభిన్న అర్థాలు ఒకే వార్తలో
From May 1, 2011

May 3, 2011

లాడెన్ వీరికి వేగుచుక్క

తెగిపడిన నా దేశపౌరుల దేహాలు
జివ్వున ఎగసి పడిన నిస్సహాయ కాయపు రగతం
ఏమి జఱుగుతుందో కూడా ఏమాత్రమూ ఎఱుగని అమాకయ ప్రాణులు
అమాయక ప్రాణుల ప్రాణాలు
మీ కంతలు బూడ్చుకోండిరా కొడకల్లారా అని
బిలియను డాలర్లు ఏడాదికి ఉచితింగా అందిస్తుంటే
బొక్కి తిని
కసాయి వనాల్ని పెంచుకుని
అమాయకుల్ని కొని
వారికి తర్ఫీదులిచ్చి
దొరికిన నావలల్లోకి ఎక్కించి
చేతికో తుపాకినిచ్చి
కనిపించిన అమాయకులను తూట్లు తూట్లుగా
తునాతునకులుగా కాల్చేయమని
బాంబులతో పేల్చేయమని
ఇదే అల్లాకి సేవయని
ఇదేరా బిడ్డా అల్లాకి సేవయని
కల్లబొల్లి కబుర్లతో
లేత ఆవేశాలను అల్లకల్లోలానికి గురిచేసి
భరతమాత గుండెల్లోకి చొచ్చుకొచ్చిన
భరమాత బిడ్డలను కొన్న
అల్ ఖైయిదా సంస్థ పెద్ద
ఒసామా బిన్ లాడెన్
కొందరికి ముద్దుబిడ్డ
కొందరికి వేగు చుక్క
నా దేశ పౌరుల రక్త సాక్షిగా
ఈ కుక్క, నా దేశపు కొందరికి వేగుచుక్క
రేపొద్దున కసబ్ వీరికి వేగుచుక్క
వ్రేళ్ళాడదీయండీ నా దేశపు విలువలను
సెక్యులర్ భూతాలను
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
వెన్నుముక విరిగిన నా దేశ ప్రజల్ని
తునాతునకులుగా నరికి
తూట్లుతూట్లుగా కాల్చి
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
ఈ వెన్నెముక లేని నా జనాన్ని