Showing posts with label *త్తి. Show all posts
Showing posts with label *త్తి. Show all posts

Jul 18, 2020

డి వి నరసరాజు

డి వి నరసరాజు


శ్రీ డి.వి నరసరాజు శతజయంతి అని శ్రీ ంభ్ఖ్ ప్రసాద్ గారి వ్యాసం ఒకటి చదివాను.

నరసరాజు గారు గొప్ప వ్యక్తి. ఆయన సినిమా వ్యాసంగం గొప్పది. సంభాషణల రచయితాగా ఎంతో ఆకట్టుకున్నారు. కథారచయితా గొప్ప రచనలు చేశారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయి - రంగులరాట్నం. ఈసినిమకి మాటలు అందించింది రాజుగారే.

ఇక ఈయన ఎన్ని సినిమలకు రాశారు అనే ఊదర కబుర్లు పక్కన పెడితే - ఒక రచయిత మీద అతని సమాజం యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. దాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టడానికే రచయిత ప్రయత్నిస్తాడు.

స్వతహాగా రాజుగారు హేతు వాది. ఆ నేపథ్యం నుండి వచ్చిందే పెద్దమనుషులు కథ.
రాజు గారు ంణ్ ఋఒయ్ అనుచరుడు. తప్పులేదు. మనకు తెలిసి ఈ భావజాలంతో ఉన్న వ్యక్తులు అనేకులు మన బ్లాగ్ లోకంలోనే ఉన్నారు. ఇన్నయ్య గారి దగ్గరనుంచి...అలా కిందకు వెళ్తే మత్తి కహేశ్..ప్రవీణ్ శర్మ....ఇత్యాదులు అనేకం.

అయితే ఈయన రాసిన ఒక సినిమా ఈయన మీదనున్న గౌరవభావన్ని కాస్త కదిలించెదే అవుతుంది.
సదరు సినిమా రాజం - యమగోల.

పలానీ వ్యక్తి చిత్రగుప్తుడి తప్పువల్ల పోతాడు.
భటులు స్వర్గానికి తీసుకెళ్ళి వదుల్తారు
"ఎవిటి! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారూ?"
"స్వర్గానికి"
"నేనింత పుణ్యం చేశానని నాకే తెలియదు"
"అంత సంతోషించకు. ఇక్కడా - కొన్నళ్లే. తర్వాత మేమె వచ్చి నరకానికి తీసుకెళ్తాం"
"అలా ఎందుకూ? ముందే నరకానికి తీస్కెళ్ళి తర్వాతే ఇక్కడ దింపొచ్చుగా. చెడి బతికినట్టు ఉంటుంది"
"అలా కుదరదు!
పుణ్యం తక్కువవ చెసి పాపం ఎక్కువ చెస్తే - ముంది స్వర్గానికి తర్వాత నరకానికి.
పపం తక్కువ చెసి పుణ్యం ఎక్కువ చేస్తే - ముంది నరకానికి తర్వాత స్వర్గానికి"
"ఓహ్ ఇదొకటుందా"...
స్వర్గంలోకి ఎంట్రీ..
అక్కడ అందరూ అప్సరసల నాట్యాన్ని అనిభవించటనికి సమాయత్తం అవుతుంటారు. అంతలో మాకు హిందుస్తానీ వద్దు అని దక్షిణాది వాళ్ళు, ఎందుకొద్దని ఉత్తరాది వాళ్ళు కొట్టుకుంటుంటారు.
ప్రాంతీయతత్వం కులం - స్వర్గానికి పోయినా పోలేదని
ఇక్కడే దర్శకుడి ప్రతిభ. దర్శకుడు - తాతినేని రామారావు.
దక్షిణ భారతీయులందరూ బేపనోళ్ళే.
అంతలో హీరోగారు - హీరోయిజం. ఆడవె అందాల సురభామిని. సినారె రచన. ఆయన ఆలోచన ఎంత గొప్పదో అనిపిస్తుంది ఈ పాట వింటే. ఈపాట రాసింది వేటూరని కొందరు సినారె అని కొందరు. చరణం మాత్రమే వేటూరిదని కొందరి ప్రతిపాదన.


సరే ఏవైన హీరోగారి పాటని నిలువరిస్తారు దక్షిణభారతీయ బేపనోళ్ళు.
"ఎవరు నువ్వు?" అహంకారం
"మీలాగే చచ్చినవాణ్ణి, స్వర్గానికి వచ్చినవాణ్ణి" హాస్యం
"ఛస్తే మాత్రం నీకూ మాకూ పోటీయా!" అదే బెదిరింపు అహంకారంతో, పిలక జుట్టు ముడివేస్తూ
"ఆరి నీ దుంప తెగ! సర్వమానవ సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్న మాట"
"నువ్వెవరో అప్రాచ్యుడివి"
"మరి మీరు నాయనా?"
"మేం పండితులం" పొగరు
"అబ్బా!" వ్యంగ్యం
"వేదాలను అవపోసన పట్టిన ప్రచండులం" "నేను 25 దేవాలయాలను కట్టించాను"
"కమీషను ఎంత కొట్టేశావ్?"
"నేను 12 యజ్ఞాలను చేయించాను"
"దేవాలయాలు కట్టించిందీ, యజ్ఞయాగాదులు చేయించిందీ స్వర్గంలో మేజువాణి చూట్టంకోసమా?"
"యజ్ఞయాగాదుల పరమార్థం - స్వర్గలోక నివాసం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి"
"ఆరి మీ అహంకారం పొయ్యిలోపెట్టా! మీరు చచ్చినా మీ అహంకారం చావలెదు. స్వర్గనికి వచ్చినా కులతత్వాలూ భాషా భేదాలు పోలేదు"
..

రచయితా వ్యంగ్యం హాస్యం అంతా బాగుంది. కేవలం బ్రాహ్మల్నే ఎంచుకోవటం ఆయన హేతువాద తత్వానికి ప్రతీక అవ్వచ్చు. కాసేపు నవ్వుకోటానికి సామాన్య నేలబారు మనిషికి ఇది బాగనే ఉంటుంది. ఇది పండింది కూడా.

కానీ - తాత్వికంగా చూస్తే - స్వర్గం అనేది ఎక్కడా ఎక్కడా అని ఎతికాట్ట ఒకతను. ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ గురువుగారి దగ్గరకెళ్ళి గురువుగారూ - స్వర్గం ఎక్కడా అని వెతికానండీ, ఎక్కడా కనిపించలేదూ అన్నాట్ట. గురువుగారు - అరే బాబూ -స్వర్గం ఎక్కడో లేదు నీలోనే ఉందీ అన్నాట్ట.

స్వర్గం రాగ ద్వేషాలకి అతీతం. ఎప్పుడైతే రాగద్వేషాలు మొదలౌతాయో - స్వర్గం మాయం.
సింపుల్ లాజిక్.

దీన్ని పక్కన పెడితే హేటువాదులు కేవలం బ్రాహ్మణులనే అపహాస్యం చెస్తారు. ఎందుకో తెలియదు. సదరు హేతువాది ఎంత చుదువుకున్నవాడైనా సరే - అదే మూస.

అంతేలే! ఈ చదువులు మనిషిని ఇజానికి బనిసని చేసేవే గానీ జ్ఞానాన్ని  ఇచ్చేవి కావుగా!

ఏవైనా డివి నరసరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరిద్దాం.

May 19, 2020

బ్రాహ్మణికల్ యాటిట్యూడ్

పొరపాటున చేయి తగిలి మత్తి కహేశ్ గారి బ్లాగుకి వెళ్ళబడ్డాను.
ఈయన బ్లాగంతా బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ తో పొంగి పొర్లుతుంటుంది.

నాదృష్టిలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అని ఇత్తు కత్తిరించాటానికి వచ్చినోణ్ణి కరిచే పందిలా గుణుస్తూ అరుస్తున్నోడికున్నంత బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు.

వెయ్యి ఏళ్ళ పరాయి పాలనలో వెన్ను విరిగిన విరచబడిన భారతదేశంలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ డైపర్లో పెంటికలు ఏరుకునే వారికి మాత్రమే కనిపిస్తుంది సదరు యాటిట్యూడ్.

ఛాలంజ్ అనే సినిమాలో రాం మోహన్ రావ్ గాంధీని "నీలాంటి దరిద్రులు" అని "అదేం తిట్టుకాదబ్బాయ్, నీలాంటి డబ్బులేని వాళ్ళని పిలిచే బిరుదు" అంటాడు. అలా మత్తి కహేశ్ లాంటోళ్ళు లుంగీ కీలయ్య లాంటి భావాలకి దాసులై మెళితిజాన్ని మత్తుగా తాగి టాస్ చేసిన పదమే బ్రాహ్మణికల్ యాటిట్యూడ్. అదేం తిట్టు కాదు అని బురిడి కొట్టించ బోతాడు మేతావి. అదేం కులానికి సంబంధించిన పదం అనుకుంటున్నావా వెర్రివాడా అని బెదిరిస్తాడూ. అసలు నీకు చరిత్ర తెలుసా అంటాడు.
పార్టీషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా అంటాడు.

ఇవన్ని కథలు. మేతావి తనాన్ని కుమ్మరించే ప్రయత్నాలు.
ఇంట్లో ఇద్దరుంటే ఒకడు చేసింది ఇంకోడు తప్పంటాడు.


ఇది కేవలం భావజాలానికి బానిసత్వమే.


By the way - I dont want to discover  what is such attitude. I will leave it to Matti Piggesh kind of intellectuals to define as there is no formal definition for such combo words

May 30, 2019

కీర్తి



ఈప్రపంచంలో ప్రతోడు నీతిమంతుడే - బయట ప్రపంచానికి.
కొత్త తరంలో ప్రపంచం కళ్ళు తనమీదపడాలనీ ప్రతోడి ఆరాటం. కళ్ళు తనమీద పడాలంటే సుళువైన మార్గం ఒకటుందని కాకిరిగుమ్మ గగ్గరనుండి సందులో పనికిరాని *నటుడి* దాకా ప్రతోడు కనుక్కున్నాడు.
ఈ మార్గం చాలా సులభమైనది. ఆట్టే కష్టపడాల్సిన పనిలేదు.
ఈమార్గాన్ని ఆలింగనం చేస్కోవాలంటే మాత్రం కొన్ని మౌళిక సూతాలున్నాయి. వాటిల్లో కొన్ని
సిగ్గు లజ్జ మానం అభిమానం ఇత్యాదివి వదిలేయాలి.
కులదూషణ తారాస్తాయికి చేయాలి.
పక్క కులాన్ని ద్వేషించాలి.
ద్వేషించటనికి భయమైతే కనీసం బ్రాహ్మణ ద్వేషం ఉండలి, మాటల మధ్యలో బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ అంటూ పదజాలాన్ని వాడగలగాలి.
ఫేసుబుక్కు/బ్లాగుల నిండా/ట్విట్టరు నిండా సూక్తులను కుమ్మరించాలి.
బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి.
జెనరలీజేషన్స్ చెయ్యాలి.
తాను తప్ప మిగతా సమాజం అంతా తాలు సరుకు అని డప్పా కొట్టాలి, సొంత బాకా ఊదుకోవాలి.
పొద్దున్నే సూక్తులు - సాయంత్రం వ్యభిచారం చేయగలగాలి.
రాజ్యాంగం/హక్కులు అంటూ మాట్లాడాలి (లీగల్ గా కేక గురూ అనిపించుకోవాలి).
పాకిస్థాన్ భజన చేయాలి.
వ్యక్తిపూజని వ్యతిరేకిస్తూ సాయంత్రానికి సొంతపూజ చేస్కోవాలి.
అందరూ తనను పూజించాలని కలలు గనాలి.
వాటిని పక్కనోడిమీద రుద్దాలి.
నా మీద కుట్ర జరుగుతుంది అంటూ కనిపించిన చోటల్లా వాపోవాలి అవసరం ఉన్నా లేకున్నా.

ఇవన్నీ ఒక ఎత్తైతే
ముఖ్యంగా చేయాల్సినవి మాత్రం ఇవి
కనిపించిన పోష్టరు మీదల్లా బురద పేడ కొట్టాలి అనగా - మోడి మీద, అమిత్ షా మీద లేక తన దగ్గర్లో ఉన్న కొండకచో సెలబ్రిటీస్ మీద అనగా ఉదాహరణకి - సే - పవన్ కళ్యాన్ మీద, కె విశ్వనాథ్ మీద, నాగబాబు మీద, నానీ మీద, సే జగన్ మీద, షర్మిల మీద, కెసీఆర్ మీద ఇలా.
ప్రధాని దొంగ అనటం.
మతాన్ని ద్వేషించటం.
మతాన్ని దూషించటం.
హిందూ తీవ్రవాదం అనటం.
మత పెద్దల్ని దూషించాలి.


ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగు చాలదు!

అన్నీ బాగనే ఉన్నాయోయ్ కానీ ఇలా ఎవరు చేస్తున్నారో ఉదాహరణకు మచ్చుకి నాలుగుగైదారేడెంది పేర్లు చెప్పు అనడగొచ్చు -
ప్రకాశ్ రాజ్ చేయట్లేదా?
హీరో సిద్ధార్థ్ చేయటంలేదా?

మత్తి కహేశ్ చేయట్లేదా?
లోకేశ్ చేయట్లేదా?
శ్రీబెడ్డి చేయట్లేదా?
ఆమాటకొస్తే తన స్థాయిలో మీకాహిరా చేయట్లేదా?

ప్రతోడు కోర్తికోసం ఖ్యాతి కోసం పాకులాడేవాడే/దే

Jul 9, 2018

మనిషి తన చుట్టూ ఉన్న సమాజం చెక్కిన శిల్పం

పదేళ్ళ క్రితం బ్లాగులు వెలిగిపోతున్న రోజుల్లో విచిత్ర వితండవాదంతో రొటీనుకి భిన్నంగా కిక్కిరిసిన పోయిన సమాజం అనే ఓ మడుగు నుండి తనని తాను బయటకి పడేస్కున్న ఓ చేపలా భావించుకుంటూ కొత్త కొత్త పదజాలాన్ని విరివిగా వాడుతూ కుల దూషణ మత దూషణ చేస్తూ అదేం తిట్టుకాదు, అడగటం తప్పు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ, సినిమా అనేది అతని సొత్తైనట్టు విర్రవీగుతూ.... నడచిన అతని ప్రస్థానం జారుడు మెట్లనీ, ఎంత తనని తాను సమాజం నుంచి బయటేస్కున్నా సమాజం అనేదాన్ని ఓ గదిలో బంధించలేమనీ, సమాజం అన్నాక దానికి కొన్ని *గుడ్డి* నమ్మకాలుంటాయనీ ఆ గుడ్డి నమ్మకాలు నీకైతే ఒక న్యాయం నాకైతే న్యాయం అనీ నమ్మటం....... వెరసి... ఈరోజు బహిష్కరణ.
ఎక్కడనుంచి? ఈరోజు సిటీ నుంచి మరి రేపు? ఎల్లుండి?

ఎందుకీ వెంపర్లాట? ఎందుకీ విపరిత పైత్యం? గుర్తింపుకోసమేనా? ఎవరిక్కావాలీ గుర్తింపు? ఎంతకావాలి గుర్తింపు? సమాజం మనోభావాలను తన్ని నిద్రలేపటం క్రిటిసిజమా?
ఇలాంటివాళ్ళు అడుగడుగునా ఉంటారు. తమ తమ స్థాయిల్లో వంచన చేస్కుంటూ సమాజం నెత్తిన రాళ్ళు పెట్టటానికి ప్రయత్నిస్తారు.
కులం పేరుతో
మతం పేరుతో
ఇజం పేరుతో
చదువు పేరుతో
మేధావి పేరుతో
విర్రవీగుతూ .... వీళ్ళు పైకి కనిపించేది ఒకటి లోపల ఒకటి.

మనిషి తన చుట్టూ ఉన్న సమాజం చెక్కిన శిల్పం!

Dec 20, 2010

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం - రాహుల్‌

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం
ఉగ్రవాదం కన్నా దానితోనే దేశానికి ఎక్కువ ముప్పు
అమెరికా రాయబారితో రాహుల్‌ వ్యాఖ్యలు
వెల్లడించిన వికీలీక్స్‌
భారత్‌ పట్ల అవగాహన లేని అజ్ఞాని
భాజపా, ఆరెస్సెస్‌ ఆగ్రహం
వివరణ ఇచ్చిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకన్నా అతివాద హిందూసంస్థలే భారత్‌కు ఎక్కువ ప్రమాదకరమని కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ అభిప్రాయపడినట్లుగా అమెరికా అధికారపత్రం ఒకటి వెల్లడించింది. వికీలీక్స్‌ బయటపెట్టిన లక్షలాది అమెరికా రహస్య విదేశాంగ పత్రాల్లో ఇది కూడా ఉంది. గత ఏడాది జులైలో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ గౌరవార్థం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన విందు సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పత్రం తెలిపింది. విందులో తన పక్కనే కూర్చున్న అమెరికా రాయబారి తిమోతి రోమర్‌తో రాహుల్‌.. దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలతోపాటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ మరో ఐదేళ్లలో దృష్టి సారించిన ప్రధాన అంశాలపైనా చర్చించారని పేర్కొంది. లష్కరేతోయిబా కార్యకలాపాలపై రోమర్‌ ప్రశ్నించినప్పుడు.. 'భారత్‌లోని కొందరు ముస్లింలు కూడా ఆ సంస్థకు మద్దతిస్తున్నారు. అయితే, మతఘర్షణలు పెంచుతూ, ముస్లింలపై రాజకీయ దాడులు చేస్తున్న అతివాద హిందూ సంస్థల పెరుగుదలే దానికన్నా మించిన ప్రమాదం' అని రాహుల్‌ చెప్పారు.

సగం కిరస్థానీ సగం పార్సీ అయిన ఓ మేధావీ, నీకు దేశం దాసోహం అంటోంది. నువ్వే మాకు మార్గదర్శకుడివీ అంటోంది. రాజావారి మాటలు కొందరు కుత్తేలకు, అరుంధతీ రాయిలకు సమ్మగా వినసొంపుగా అనిపించవచ్చు.


కుట్ర ఉండవచ్చన్న కాంగ్రెస్‌
రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగటంతో కాంగ్రెస్‌ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదం, మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దేశానికి ప్రమాదమేనని, వాటిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నదే రాహుల్‌గాంధీ అభిప్రాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ పేర్కొన్నారు. వికీలీక్స్‌ వెల్లడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అన్న అనుమానాలున్నాయని, సత్యాసత్యాలు నిగ్గు తేల్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.

కుట్ర ఉంది వికీలీక్సులో కాదురా రాజకీయ దురహంకారీ. కుట్ర ఉన్నది నీ మనసులో, వెన్నెముకలేని నీ రాజకీయ స్వార్థపు విధేయతలో, కుట్ర ఉన్నది ఏంచేసైనా మళ్ళీ ఎలక్షన్లు గెలవాలనే సంకుచిత ఆలోచనలో.

Mar 23, 2010

కందిపప్పు బ్యాన్ చేస్తే ఊర్కుంటారా?

అరేయ్ ఏటినీగోల
ఆ, ఆవు మాంసం నాకిట్టం. అదే కావాలి.
అరేయ్ వద్దన్నాగా. సదుకో, ఎదవ, జెల్లకాయేస్తా
హా!! నువ్వేమో కందిపప్పు తినచ్చు, నేను ఆవుని తినకూడదా?
అరేయ్, తంతా నిన్ను. బుర్రతక్కువ వెధవ. పాల దిగుబడి తగ్గిందట్రా
ఆఅ, అంతే, అట్టైతే బఱెల్ని వధించటం బ్యాన్ చేయచ్చుగా
అబే గధె!! కర్ణాటకలో ఆవులెక్కువరా సన్నాసి
ఐయే మాత్రం కందిపప్పు బ్యాన్ చేస్తే నువ్వు ఊర్కుంటావా
ఓరేయ్ తిక్క సన్నాసి, కందిపప్పు తినే శాతం ఎంత, ఆవులు తినేవాళ్ళ శాతం ఎంత, ఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ. ముయ్
[కందిపప్పుని తినేటోళ్ళు కేవలం బేపనోళ్ళని కొందరి భావని. అట్టాంటోళ్ళంజూసి సింతిస్తున్నా.]

Nov 6, 2009

డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట

National Sample Survey Organisation (NSSO) conducts nationwide sample surveys on various socio-economic issues in successive rounds, each round covering subjects of current interest in a specific survey period. The organisation has four divisions :
(i) Survey Design and Research Division (SDRD)
(ii) Field Operations Division (FOD)
(iii) Data Processing Division (DPD) and
(iv) Co-ordination and Publication Division (CPD)
ఈ NSSO నిర్వహించిన ఒక సర్వే ప్రకారం డ్రాపౌట్స్ కి కారణం విద్యార్ధుల్లో ఉత్సుకత లేమి ప్రధానకారణమట.
మా నాయన ప్రధానోపాధ్యాయుడిగా చేసేప్పుడు డ్రాపైట్స్ పై జరిగిన ఒక సర్వే ప్రకారం కనుగొన్న కొన్ని నిజలు -
తెలుసుకునే ముందు -
అసలు ఈ రోజూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు ఎవరూ? సింహభాగం బీద బిక్కి, కూలీలు, పేద లోయర్ మిడిల్ క్లాస్, మిగతావాళ్ళు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే తాయిలాలను మిస్ కాకూడాదూ అనుకునే గుంపు. అలానే ప్రతీ సంవత్సరం, కాలంలో మార్పుల చక్రం మనకి తెలుసు. బళ్ళు మొదలైయ్యేది జూన్ మన్నెండు. డ్రై సీజన్. అప్పుడు బళ్ళు కళకళల్లాడతాయి. జులై దాటి ఆగస్ట్ వచ్చేప్పటికి సగం అయి కూర్చుంటాయి బళ్ళు. కారణం, నాట్లు మొదలవ్వటం, కూలలకి గిరాకీ ఏర్పట్టం. వ్యవసాయ కూలీలుగా వెళ్ళేవాళ్ళలో పది నుండి పదిహేనేళ్ళ పిల్లశాతం ఇంత అని పై సర్వే చెప్తే నేను మెచ్చుకునేవాణ్ణి. అలానే పంట చేతికొచ్చే సమయంలో బళ్ళు ఖాళీ.
సర్వే వివరాల్లోకొస్తే -
ఎక్కువ డ్రాపౌట్లకు ఎవరివీ? - పై కూలీల పిల్లలవి.
ఉదాహరణ - మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యమైన పంట మల్లెలు. ఇటు గుంటూరికి అటు బెజవాడకీ మల్లెపూలు మంగళగిరి మండలం నుండే వచ్చేది. పూలు కోసేది ఎవరూ? ఈ పిల్లలే!!
కొంతశాతం - కూలీలుగా వెళ్ళిన తల్లితండ్రుల కుటుంబాలకు పిల్లల్ని చూసుకునే అవసరాలు, బరెగొడ్లు కాసుకొచ్చే అవసరాలు ఇత్యాదివాటికోసం కొంతశాతం మంది పిల్లలు బడికి ఎగనామం పెట్టేస్తున్నారు.

తగ్గించే దిశ -
మధ్యాన భోజన పధకం
పనికి ఆహార పధకం (తల్లితండ్రులకు, సో దట్ పిల్లల సంపాదనపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా)
ఉచిత వసతి
ఉచిత పుస్తకలు
యాట యాట యాట.

NSSO ప్రభుత్వ యాజమాన్య సంస్థ కదా. అందుకని వాళ్ళు నిజాలను కప్పెట్టేసారేమో, ఎందుకంటే “lack of interest” by students అనే పదం లేక స్థితి మనకి లేనె లేదు. అసలు పిల్లవాడికి *నాకు నచ్చలేదు* అనే స్వాతంత్రం లేదు. బడిమానెసే నిర్ణయం పిల్లవాడికి కలలో కూడా అందుబాటులో లేదు. బడిమానేయటం కేవలం తల్లితండ్రుల నిర్ణయం. నిజమైన పరీస్థితులను అందించటం ప్రభుత్వ రంగ పబ్లికేషన్స్ కి కష్టమే. అందుకని సమస్యని ఏ ఉపాధ్యాయులమీదనో తోసేస్తే *ఉపాధ్యాయుల ప్రక్షాళన* అని చెప్పో మరింకో మాటచెప్పో ప్రపంచబ్యాంక్ ఫండ్స్ కొట్టేయచ్చని ప్రభుత్వ పన్నాగం అయిఉండొచ్చుకూడా.

Nov 5, 2009

తెలుగు మాధ్యమ బళ్ళ బోధనలో నాణ్యత లేదా?

కూడలి/బ్లాగులు వ్యాఖ్యల్లో ఎక్కడో ఎవరో ఇలా ఇచ్చన ఒక స్టేట్మెంట్ నా కంటపడింది -
>>ఇప్పటికీ సగర్వంగా తెలుగుమీడియం చదువులు చదువుతూ, బోధనలో నాణ్యత లేక...యాట యాట యాట
ఎక్కడ నాణ్యత ఉందీ?
సందుచివరన ఉన్న ఒక పాకలో కాన్వెంటుపెడితే, కాన్వెంటుపెట్టినోడి బామ్మర్ది పెళ్ళాం తమ్ముడి బామ్మర్ది అక్కని టీచరుగా అప్పాయింటుచేస్కుంటున్నారు. ఆమె ఏమి చెప్తుందీ? అర్హతలు ఏంటి?
అసలు ఒక ఆంగ్ల లేక తెలుగు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల అర్హతని ఎవరు పరీక్షిస్తారు, ఎవరు నిర్దేశిస్తారూ? ఆ ఉపాధ్యాయ స్థానాకి ఎంపిక విధానం ఏంటి?
కూర్చోపెట్టి నాలుగుముక్కలు ఆంగ్లంలోనైనా తెలుగులోనైనా ఓ బెత్తంపుచ్చుకుని రుబ్బించటానికి ఏ అర్హతా అవసరంలేదు. ఇప్పటి పాఠశాలల్లో జరుగుతోంది అదే.
తమతమ బోధనా అంశాల్లో చేతులుతిరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు నాకు కొన్ని వందలమంది తెలుసు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు పాసై, ఇంటర్వ్యూలలో నెగ్గి బోధనావృత్తిని చేపట్టినవారు.

ఇక్కడ విషయం - క్రేజ్. పక్కనోళ్ళని చూసి వాతలు పెట్టుకొనుట. ఆళ్ళు జేర్పించారు, మనమేం తక్కువా? అని హంగు పొంగు చూపుకోటంకోసం. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ అని రైం పాడుతుంటే అర్ధం కాకపోయినా వచ్చే కిక్కు కోసం.

ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇలా ఆడిపోసుకునే హక్కు ఎవరికీ లేదు, నిజంగా ఆ ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు తప్పుచేస్తే తప్ప.
ఎన్ని ప్రైవేటూ బళ్ళకు కనీస వసతులు ఉన్నాయీ?
ఓ ఆట స్థలం ఉందా?
ఓ ల్యాబ్ ఉందా?
క్రాఫ్ట్స్ పీరియడ్ అంటే ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలకు తెలుసూ?
ఎంతమంది ప్రైవేటు బడిపిల్లలు బళ్ళో మొక్కలు నాటతారు?
ఎంతమంది పిల్లలు ఆ మొక్కలకు నీళ్ళు పోస్తారు?


ఉపాధ్యాయ కుటుంబం మాది, తరతరాలుగా. పల్నాడు మొత్తంలో మా నాయన కీర్తిప్రతిష్టలు సంపాదించిన లెక్కల ఉపాధ్యాయుడు. బజారులో నడచి వస్తుంటే లేచి నిల్చునే వాళ్ళు జనాలు, అదీ ఆరోజున ఓ ఉపాధ్యాయుడికి, *ఉపాధ్యాయుడికి మాత్రమే* దక్కిన గౌరవం.
కారణాలు - ఉపాధ్యాయుల మేధస్సు. విషయపరిజ్ఞానం, సాహిత్యావలోకనం, నిరంతర పఠనం, బాధ్యత, విశాల ధృక్పదం, మరియూ ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం అన్నిటికన్నా నేను నలుగురికీ చెప్పాలంటే నేను నిష్టగా ఉండాలి విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉండాలీ అనే డెడికేషన్.

పదోతరగతి వాళ్ళకు పోటీలుపడి మరీ డిశెంబరుకల్లా పాఠ్యాంశాలు బోధించేసి, వారానికో పరీక్షపెట్టి వాళ్ళకు పదునుపెట్టి, పెద్దపరీక్షలు దగ్గరైయ్యేకొద్దీ రోజుకో పరీక్షపెట్టి, సాయంత్రాలు ఎత్తుబళ్ళో చదువుకునే గంటల విధానాలు ప్రవేశపెట్టి ఇలా అనునిత్యం కష్టపడేవాళ్ళు ఉపాధ్యాయులంటే. కొందరు ఉండొచ్చు, సొంతవ్యాపారాల్లో మునిగితెలేవాళ్ళు.

ఎందుకిలా? ఒకానొన రోజున ఉద్యోగం ఏదైనా మహాప్రసాదంలా భావించేవాళ్ళు. ఉపాధ్యాయవృత్తి చేప్పట్టటం అంటే అదో కల మరియూ అవసరం కూడా. పేద లేక మధ్యతరగతి వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉపాధ్యాయులుగా. ధనికులైన వాళ్ళు అతితక్కువ. అందుకే వీరికి వేరే వ్యాపారాలు గట్రా ఉండేవి కావు. మరియూ లైఫ్ టైం కమిట్మెంట్. ముఫైయైదు సంవత్సరాలు సర్వీసు కాలం. మరి ప్రైవేటు ఉపాధ్యాయులకో? ఈరోజు వస్తాడు, రేపు, బబాయ్ ఇంతకన్నా ఎక్కువ డబ్బు చిట్ ఫండ్లో వస్తోందీ అని మానేస్తాడు. కొత్త ముఖం వస్తుంది మళ్ళీ, ఈ వచ్చినవాడు, నేనే వేరే వ్యాపారం చేస్కుంటా అని సగం లో నిష్క్రమిస్తాడు.

ఈరోజున శ్రీ చైతన్యా లాంటి కార్పోరేట్ విద్యాసంస్థలు నిజంగానే స్టేట్ ర్యాంకులని కొల్లగొడుతున్నాయా?
ఉత్తి బూటకం, ఉత్తి నాటకం.
తాడికొండ లాంటి ఏపి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఒకప్పుడు ఊపేసాయి. కారణం, అప్పట్లో దానికి అర్హత కేవలం మెరిట్. తర్వాతర్వాత మెరిట్ కన్నా వార్షికదాయపరిమితి ఎక్కువైంది. దాంతో, వాటికి వెళ్ళే విద్యార్ధుల సంఖ్య, స్థాయి పడిపోయాయి, మరియూ రిజర్వేషన్స్ ఎక్కువకావటం కూడా జరిగింది.