Jul 27, 2011

దేవ్.డా!!! నాకు గిటారెందుకియ్యలే?

దేవ్.డా!!
అడక్కుండానే ఐఫోన్ ఇచ్చినవ్.
అడుక్కుంటే కారిచ్చినవ్, లోన్లోనేలే.
ధర్మప్రభువ్వి, పెండ్లిజేపిచ్చినవ్, బిడ్డల్నిచ్చినవ్
ఇసుమంత తెల్వినిచ్చినవ్
గిటారెందుకియ్యలే?
ఐ కొసెన్ యూ ఆన్సర్ దేవ్.డా
నాకు గిటారెందుకియ్యలే?
ఇప్పుడుజూడు, ఈ పాటలు, ఎట్లా వాయించలె, నాకు గిటారు రాదు. కానీ వాయించాలె. ఎట్టా దేవ్.డా? ఎట్టా?

బాబులూ అమ్మలూ దయగల ప్రభువులూ!! మీలో ఓరికన్నా గిటారు మీట్టం వస్తే ఈపాట వాయించి, రికార్డింగ్ చేసి అంతర్జాలంలోకి ఎక్కించి లింకు కొట్టాల్సిందిగా వేడుకుంటన్యా!!

**********************************
Song: AANE WALA PAL JAANE WALA HAI
Vocals: Kishore Kumar
Movie: GoLMaaL
**********************************


Strumming Pattern: | d - d u | d u d u |


Chords:

E---------C#m-B----------E--
Aane wala pal jaane wala hai
-----------B--------------E----
Ho sake to isme zindegi bita do
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E-----------C#m------------E-
Ekbar yum mili masoom si kali
-------------A---------------------E-
Khilte hue kaha, "Kushpash main chali"
-----------B-------------------E------
Dekha to yehi hai Dhoonda to nahin hai
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E----------C#m-------------E--
Ekbar waqt se lamha gira kahin
-----------------A----------------E--
Wahaan dastaan mili Lamha kahin nahin
-----------B--------------E---
Thoda sa haske Thoda sa rulake
------------A----------C#m-----G#-C#m
Pal yeh bhi jaane wala hai ... ho ho

పులి ఆత్మఘోష

1972-73కు ముందు దేశవ్యాప్తంగా 40 వేలకు పైగా పులులు ఉండేవి. తరువాత వివిధ కారణాల వల్ల వీటి సంఖ్య 1800కు పడిపోయింది.
ఈవేళ పొద్దున ఈనాడు పేపరులోది పై వార్త.
ఎక్కడ నలభై వేలు ఎక్కడ పద్దెనిమిది వందలు??? సిగ్గులేన ప్రభుత్వం, వన్యప్రాణులంటే బాధ్యత లేని ప్రజ అని పై వార్త చూడగానే బజ్జాను.
ఇందాక ఛానల్స్ అటు ఇటు తిప్పుతుంటే కరెంట్ టివీలో వాన్గార్డ్ టైగర్ ఫార్మ్స్ అనే ప్రోగ్రాం దగ్గర ఆగింది రిమోటు. ఏట్రా అనిచూస్తే వళ్ళు జలదరించిండి ఆ కార్యక్రమం. పులిచర్మాల దుకాణాల దగ్గరనుండి పులి మాంసం అమ్మే దుకాణాలు, పులి వైను అమ్మేదుకాణాలు పులి వంటాలు అమ్మే అంగళ్ళు మియాన్మార్లో ఉన్నాయని చూపాడు. క్రితంతోజు చంపుకొచ్చిన పులి కిచెన్లో పడేసుంది. చర్మం వొలిచారు. మాంసం ముద్ద అలా పడేసుంది. ఈ కార్యక్రమాన్ని తీస్తున్నవాడు, వాడి పేరు యమగూచి, బాబూ నాకు ఫ్రెష్ టైగర్ కావాలి ఉందా అనడిగాడు. యా ఉంది, కిచెన్లోకి రండి అని తీస్కెళ్ళిందామె. పులి మాంసాన్ని కత్తితో కోసి సూప్ పెడుతుందట.



నలభైవేల టైగర్లు పద్దెనిమిది వందలు చేయటానికి మానవమృగానికి ఆట్టే సమయం పట్టలేదు. చైనాని మియాన్మార్ని అనుకుని మనం సాధించేదేమీ లేదు. మనమూ అందులో పాలుపంచుకుంటున్నవాళ్ళమే అని చెప్పటానికి సిగ్గుతో తలవంచుకోవాలి.

చట్టం న్యాయం గట్టి చేస్కోనంత కాలం, డబ్బు లంచం చేతులు మారినంత కాలం, అధికారులు రాజకీయ నాయకులు అమ్ముడు పోయినంతకాలం మాణవమృగానికి ఎదురులేదు. అడవిమృగాల వేటకు తిరుగులేదు.

కొనసాగుతూనే ఉంటాయి. అవి అంతరించిపోయేంతవరకూ!!!!!

వాన్గార్డ్ టైగర్ ఫార్మ్స్ వీడియోలు ఇక్కడ లభ్యం -
http://current.com/shows/vanguard/video/#

పులి చావుని చూడాలనుకుంటే పై వీడియో చూడచ్చు!!

జై హింద్

Jul 25, 2011

అతిరాత్ర అగ్నిచయన

athi_657836f.jpg


నాలుగు వేల ఏళ్ళనుండి ఓ పరంపరగా కొనసాగుతూ వస్తున్నది ఈ యజుర్వేదీయ అగ్ని కార్యం. అతిరాత్ర అగ్నిచయన అంటారు దీన్ని. కేరళలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రతీ ఏడాది ఈ కార్యం జరుగుతుంటుంది.

The Atiratra Agnicayana (ati-rātrá agní-cayana "the building up of the fireplace performed over-night") or Athirathram (Malayalam: അതിരാത്രം); the piling of the altar of Agni is a Śrauta ritual of the Vedic religion, the predecessor of modern day Hinduism which is considered to be the greatest ritual as per the Vedic ritual hierarchy.[1] It is also the world's oldest surviving ritual.[2] Its mantras and theological explanations in the Brahmana texts are first attested in the Yajurveda Samhitas (Taittiriya, Kathaka; Vajasaneyi). The practice of this ritual was generally discontinued among Brahmins by the late Vedic period, during the rise of Jainism and Buddhism in India. Nevertheless, a continuous, unbroken 3,000 year tradition has been found to exist among a few Nambudiri Brahmin families in Kerala, South India.

కొందరు శాస్త్రవేత్తలు మరి అగ్ని కదా? పొగ, అది ఇది, వాతావరణ కాలుష్యం అని గగ్గోలుపెట్టేవాళ్ళను ఊరడించటానికి శాస్త్రీయ పద్ధతిలో స్టడి చేసారట ఈ తంతుని.

దానికి సంబంధించిన వార్త ఇదిగో!!

http://www.thehindu.com/sci-tech/article2103881.ece

A 4,000 year old fire ritual conducted in the remote village in Kerala in April this year has a positive impact on the atmosphere, soil and other environment effects, according to scientists who are now ready with their findings.

The "Athirathram" ritual held on April 4— 15 at Panjal village in Thrissur district was the focus of a detailed study by a team of scientists led by Prof V P N Nampoori, former director of the International School of Photonics, Cochin University of Science and Technology.

The scientists had focused on the fire ritual's scientific dimensions and impact on the atmosphere, soil and its micro—organisms and other potential environmental effects.

The yagna seems to have accelerated the process of seed germination and also the microbial presence in air, water and soil in and around the region of the fire ritual is vastly diminished, according to a statement released by the Varthathe Trust, who organised the ritual.

The team had planted three types of seeds — cowpea, green gram and Bengal gram — on all four sides of the ritual venue at varying distances. They found that the growth was better in case of pots kept closer to the fire altar.

This effect, the study says, was more pronounced in the case of Bengal gram with growth about 2,000 times faster than in other places.

According to Nampoori, sound is a vibration and continuous positive vibrations through chanting, accelerates the process of germination.

"The findings would not only help dispel superstitious notions associated with Vedic rituals but also help in continuation of such tradition for the betterment of nature and the environment," says Nampoori.

He added that further research on the phenomenon were on which could prove that some bio—amplifier generated in the atmosphere because of the ritual, had a selective effect on Bengal gram.

Jul 22, 2011

అది హత్యా ఆత్మహత్యా ??

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి తెలంగాణ కోరుతూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, కేకే, వీహెచ్‌, బలరాంనాయక్‌, వివేక్‌, రాజయ్య, మధుయాష్కీ, రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, సారయ్య, జూపల్లి, తెదేపా ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, భాజపా నేతలు నిర్మలా సీతారామన్‌, లక్ష్మణ్‌ తదితరులు గురువారం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


ఇదేందిదీ? ఏపి భవన్లోకి అనుమతించలేదు. అప్పుడు మార్చురిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చుగా? అసలు శవాన్ని మార్చురీలో ఉంచాలా ఏపిభవన్లో ఉంచాలా అనేది పోలీసులు పోస్టుమార్టం చేసినాక కదా?

ఎపి భవన్లో ఉంచితే మర్యాద ఇచ్చినట్టు అని ఓ పెద్ద మనిషి అంటా ఉన్నాడు. అంటే మార్చురిలో పెట్టే శావాలన్నిటికీ అవమానం చేసినట్టా?



అయ్యా! నాదొక ఫండమెంటల్ ప్రశ్న
సదరు యాదిరెడ్డి గారు ఆర్మహత్య చేస్కున్నాడని వార్తాపుత్రికలు రాసుకొస్తున్నాయి. అది ఎవరు ధృవీకరించారు?
అది హత్యా ఆత్మహత్యా అని ఎవరు పరిశోధన జరిపారు? రిపోర్టెక్కడా? ఎపి భవన్లో ఉన్న వ్యక్తి చెట్టుకి ఉరేస్కున్నాడంటే ఎలా వేస్కోగలిగాడు? తాడుని ఎలా తీస్కెళ్ళ గలిగాడు. కొమ్మకి ఎలా కట్టగలిగాడూ? చెట్టుపైకి ఎక్కి తాడు కట్టుకున్నాడా? లేక బెంచి వేస్కుని తాడు కట్టాడా? బెంచి వేస్కుని ఎక్కితే అక్కడ బెంచి దొరికిందా?

చెట్టు కొమ్మకి తాడు కట్టిన వ్యక్తి ఉరిని మెడకు ఎలా ధరించగలడూ? ఎలా ఉరిపోస్కోగలడూ? తాడు మెడకేస్కుని కిందకి దూకాడా? అలా దూకితే చెట్టు కదల్లేదు, ఎవరూ చూళ్ళేదా?

తెలంగాణ రావాల్సిందే!! దానికి ఇవి కాదు మార్గాలు.
అమాయకుల ప్రాణాలను హరించి, శవాలపై తెలంగాణ పోరాట ఏనుగలును నడిపించి ఇదే పోరాటం అంటానికి తె పోరాట కర్తలు ఛెంగీజ్ ఖాన్లు బాబరు అక్బర్లు కారు. ఇది వెయ్యేళ్ళక్రితం సమాజం కాదు. ఇకనైనా ప్రాణాలతో చెలగటాలను ఆపి, సక్రమమైన మార్గంలో పోరాటం చేస్కోండి. విలువైన ప్రాణాలను కాపాడండి. సామాన్యుల ఆస్థులను కాపాడండి. ప్రభుత్వ ఆస్థులను కాపాడండి.

జై హింద్
జై జన్మభూమి

[గమనిక - పిచ్చి పిచ్చి అసందర్భ కమెంట్లు ప్రచురింపబడవు]

Jul 21, 2011

దున్నపోతా!! సిగ్గులేదూ?

ఏపీ భవన్‌ ఘటనపై విచారం వ్యక్తంచేసిన హరీష్‌
న్యూఢిల్లీ : ఏపీ భవన్‌లో జరిగిన ఘటనపై తెరాస శాసనసభ్యుడు హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. చందర్‌రావుకు క్షమాపణ చెప్పానని దీన్ని మరింత రాద్దాంతం చేయడం తగదని ఆయనన్నారు.

http://timesofindia.indiatimes.com/videos/news/Drama-at-AP-Bhavan-TRS-MLA-beats-up-official/videoshow/9311399.cms
ఇందులో వీడియోలో క్రిస్టల్ క్లియర్గా హరీష్ రావ్ ఓ వ్యక్తిని కొట్టడం చూపించారు. హరీష్ రావు ఒప్పుకున్నాడు.
మరో వ్యక్తిపై చేయి చేస్కోటం నాకు తెలిసైతే నేరం. ఇతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?
మరింత రాద్ధంతం చేయడం తగదా?

దున్నపోతా!! సిగ్గులేదూ?

నేరం చేశావా?

నరకం ఎలా ఉంటుంది?
చీకటి చీకటిగా.....
రావుగారి తలంతా వర్షాకాలంలో కటిక చీకట్లో చిట్టడవిలా ఉంది.
పైన భగ్గున మండే సూర్యుడు.
బైట ఫెళ్ళున కాసే ఎండ.
ఎండ ఎలా వుంది?
పులికోరలా, పాము పడగలా.
నరకం ఎలా ఉంటుంది?
పులితో పాముతో చీకటిగా.....
కచేరిలో అంతా చీకటిగా ఉంది. ఎదురుగా బల్లమీద నల్లని చీకటి గుడ్డ, సిరాపడితే విషంలో విషమ్లా కలిసిపోతుంది. ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి. పోలీసువారి ఎర్రటోపీలనిండా చారలు చారలుగా చీకటి. చుట్టూ పడున్న ఖాళీసారా కుండలనిండా చల్లారిన చీకటి. ముద్దాయీల కళ్ళనిండా దీనంగా అజ్ఞానపు చీకటి.
బంట్రోతు వెళ్ళి పదకొందు గంటలూ కొట్టగానే రావుగారు కచేరిలో 'బెంచి' మీద కూర్చున్నారు.
ఇరవైయ్యేళ్ళయి ఇలా కచేరిలో అడుగుపెట్టడం, ఠంగున పదకొందు మోగడం.
ఎన్నాళ్ళకో మోక్షం?
ఈ వూరొచ్చి ఇలా గంటలు వింటూ అప్పుడే ఏడాదయింది.
నిన్న లెక్కలుకూడి రిపోర్టు పంపిన ప్రకారం ఈ యేడాదిలోనూ ఆరువేల సారా కేసులు!
సారా కేసులు! ఆరు వేలు!
మూడు వేలమంది జరిమానాలు కట్టుకుంటున్నారు. దాదాపు మూడువేల మంది జైలుకి పోయారు. యాభైమంది కాబోలు యిళ్ళకి శుభంగా పోగలిగారు.
ఒక్క ఏడాడిలో తన చేతిమీదుగా యింతమంది?
మొత్తం ఇరవైయేళ్ళలోనూ ఈ విధంగా ఎంతమంది?
లెక్కకట్టలేక, ఊహించుకోలేక. అంతుదొరక్క రాత్రంతా నిద్రపట్టలేదు.
తలనొప్పిగా ఉంది.
జ్వరం తగిలిందా?
అలానే వుంది. వళ్ళంతా మండుతోంది.
బైట ఎండలా పాముపగలా.
రాత్రల్లా దయ్యాల ముఖాలే కనిపించాయి.
వాళ్ళంతా అన్ని వేలమందీ ఇప్పుడెక్కడ చెప్మా? ఎక్కడ?
కటకటాల వెనక కుళ్ళి కుళ్ళుంటారు. అక్కడే అందులోనే చచ్చుంటారు.
బైటికొస్తే -
పగబట్టి వుంటారు.
నామీద కొన్నివేల పగలు. లోకంలో కోటాను కోట్ల పగలు.
పాముల్లా వాటి పడగల్లా 'ఏమిటి?!! ఏమిటివి?!!'
"కొత్త కేసుల్లో సారాట్యూబులు సార్‌" అన్నాడు బెంచి గుమాస్తా
"అంతేనా?"
రోజూ ఇలాగే పాముల్లా సారా ట్యూబులు.
మోటార్లవి, సైకిళ్ళవి, ఎర్రవి, నల్లవి.
అన్నిట్లోను సారా! కోర్టుకొస్తే సారా, కోర్టులో వున్నంత సేపూ సారా. రోజూ దాదాపు ప్రతి కేసు సారా.
కూలీలు జెయిలుకి, కుష్టురోగులు జైయిలుకి, అమాయకులు జైలుకి, దరిద్రులు జైలుకి, ఆడవాళ్ళు, అనాధలు అంతా జైయిలుకి-
మరెక్కడికి? అంతా జైయిలుకే.
రావుగారి మెదళ్ళో చలి.
కీకారణ్యంలో చీకటి చినుకుల్లో అల్లుకొన్నట్టుగా మెదళ్ళో చలి అల్లుకొంటోంది.
"ఎవరది?"
"ఏమిటి సార్??" అని అడిగేడు బెంచి గుమాస్తా.
ఓహో కోర్టు కదూ!
మర్చేపోయాను.
ఎదురుగా మిల్చున్న ఆడమనిషి 'ముద్దాయీవేనా?'
"అవును బాబూ!"
బెంచి గుమాస్తా కాయితం కట్టొకటి చేతికందించాడు.
ఎదర న్లిచున్న ముద్దాయీ ముప్పైయేళ్ళది. చింపిరిజుట్టుది. పాలిపోయిన ఎర్రనిది. ఆమె కాళ్ళనిండా బురద బురద, వంటినండా బుగ్గి బుగ్గి, కోకనిండా డాగులుడాగులు, తలనిండా పేలు పేలు, కళ్ళనిండా జడుపు జడుపు, గుండెల్లో భయం భయం, చేసిన నేరం సారా సారా....
"ఏం అమ్మా! నీ దగ్గర సారా పట్టుకున్నరా?
మామూలుగానే మాట్లాడుతున్నాను, మరేం భయంలేదు; రాత్రల్లా పిచ్చెక్కినట్టుగా ఉంది. మరేం భయంలేదు.
"మాట్లాడవేం; సారా పట్టుకున్నరా?"
ఆడదాన్ని, సరిగా, రోజులాగే కరిరాను. మరేం ఫరవాలేదు.
"పట్టుకున్నారా??"
"పట్టుకున్నారు బాబూ."
"నేరం చేశావా?"
"నేరం చేశావా అంటే ఏటిసెప్పేది బాబూ! అర్ధరూపాయి కూల్డబ్బులిచ్చి మొయ్యమన్నారు బాబూ!"
"అదే నేరం చేశావా?"
"ఏ టెరగనట్టు సావుకారుబాబూ ఒల్లకున్నాడు, బాబూ."
"షావుకారు సంగతి కాదు; నువ్వు నేరం చేశావా? లేదా?"
"సేసాను బాబూ,"
"డబ్బు కట్టుకోగలవా?"
"ఎంత బాబూ?"
"వంద."
"వొందే రూపాయలేవుంటే, అర్దరూపాయి కూల్డబ్బులకి అమ్ముడు పోతానా బాబూ?"
"అయితే ఆరు వారాలు."
జెయిలు జెయిలు!!
మామూలు ధోరణిలో పడుతున్నాను. మరేం భయంలేదు. కొంచెం తలనొప్పిగా ఉంది...రాత్రల్లా దయ్యాలు...
ఎవరో కెవ్వున...
ఏమిటది?
ఏడుపా? ఎవరిది?
"నా కొడుకు బాబూ!.... ఒల్లకోరా నాయనా."
ముద్దాయి వెనకనుంచి ఆమెకాళ్ళు పట్టుకొని మూడేళ్ళపిల్లడు భావిపౌరుడు, భగవంతుడెలా పుట్టించాడో అలా ఉన్నాడు. భయంతో ఏడుస్తున్నాడు.
"ఎందు కేడుస్తున్నాడు?"
"నిన్న ఇయాల్టేళకి తిన్నకూడు! మరేడడా బాబూ?"
ఆకలి.....ఏడుస్తున్నాడు!
"పిల్లడి కెవరూ లేరా?"
తండ్రి? తోబుట్టువులు? తాతలు? తండ్రి తోబుట్టువులు? నీ వాళ్ళు? చుట్టాలు, నేస్తాలు? ఎవరూ? ఎవరూ లేరా? ఇంత ఊరుంది. ఇంత దేశం ఉంది. ఇంత జనాభా వుంది! ఇంత మందిలో ఎవరూ లేరా!!
"అడవిలో ఉన్నట్టున్నాం బాబూ!"
అడవిలో అతి చీకటి!
అక్కడ పులులూ, పాములూ!
అక్కడ సూదుల్లా చీకటి చినుకులు.
"మరైతే పిల్లణ్నేం చెయ్యడం! ఓయ్, ఎవరక్కడ! మీ స్టేషన్ కేసేనా! జెయిలు వారంటు రాయించినప్పుడు 'పిల్లడితో తల్లి‌' అని గుమస్తా చేత రాయించు. మర్చిపోకు; రాయకపోతే జెయిల్లో తీసుకోరు, బైటుంటే కుర్రాడు చస్తాడు"
"చిత్తం"
ఏడుపు దూరమయింది.
బైటుంటే చస్తారు. జైల్లోనే బతకాలి.
- మోక్షం; ఆరు సారా కథలు; కీ.శే శ్రీ రావిశాస్త్రి
విశాలాంధ్ర దినపత్రిక ౧౪-౫-౧౯౬౧
కళ్ళముందు కోర్టు నేపథ్యం కదిలనట్టు, అజ్ఞానులు అనాధలు అమాయకలు జైలుకి వెళ్తున్నట్టు, భావిపౌరులు ప్రశ్నిస్తున్నట్టు అనిపించలేదూ?
పంతొందొందల అరవైఒకటిలో రాసిన ఈ కథ, నేటి కథకు ఏ మాత్రమూ తేడా లేదు. అవే కోర్టులు, అవే బల్లలు, అవే గోడలు, అవే నల్లకోట్లు, అవే కళ్ళద్దాలు, అవే నేరాలు కాదు కాదు మరింక ఎక్కువ నేరాలు, అపరిష్కృతంగా పెరిగిపోతున్న ఫైళ్ళు, ఊపిరాడని న్యాయమూర్తులు, నేటి ముద్దాయిలు. ఏ మార్పూ లేనివి అనేకం. భయంకరమైన మార్పులు చెందింది మాత్రం సమాజం. నేరాలు చేసే తరీకా మారింది. పద్ధతి మారింది. షావుకార్ల తెలివి పుచ్చిపోయింది. అమాయకులు మాత్రం వెళ్తూనే ఉన్నారు, జెయిళ్ళకి.
న్యాయవ్యవస్థకి పట్టిన బూజూ అలానే వేళ్ళాడుతోంది. బహుశా పాత బూజి కిందకి పడిపోయి కొత్త బూజు పట్టుండవచ్చు.
అప్పటి నుండి ఇప్పటివరకూ
"నేరం చేసావా" అనే దగ్గరే ఆదిపోయింది మన (అ)న్యాయవ్యవస్థ. ఎందుకు చేస్తున్నారో ఇన్ని నేరాలు అనే కోణాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు లేవు. ఉండవు. ఉండబోవు. ఎందుకంటే, ఆ ఒక్క కోణం రావణ కాష్టపు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. తట్టుకోలేదు న్యాయవ్యవస్థ. వేళ్ళు నల్లకోట్లను ప్రశ్నిస్తాయి ఆ దిశగా వెళ్తే. వేళ్ళు న్యాయాధికారులవైపు తిరుగుతాయి. వేళ్ళు న్యాయవ్యవస్థ మొత్తాన్ని ఎత్తిచూపుతాయి. ప్రబుత్వాన్ని తప్పుపడతాయి. అరాచకం జరుగుతుంది. కత్తులు బయల్పడతాయి. షావుకార్లు రగిలిపోతారు. దేశాన్ని కూల్చేస్తారు.
అంతకన్నా, అమాయకులను జెయిల్లో పెట్టటమే ఉత్తమం. బలైపొయ్యేది అమాయకులేగా? పోనీయండి.
ఎందరు రావిశాస్త్రులు వచ్చి వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపినా, ఏమాత్రమూ మార్పురాని సమాజంలో ఉంటున్నాం. అదే పదివేలు మనకు. రావిశాస్త్రులు వస్తుంటారు, రాస్తుంటారు, కాల గర్భంలో కలుస్తుంటారు...............................................మనకేంటి!!


Jul 19, 2011

బాంబె బాంబె తరరరం ప

హుయి నయీ సుబాహ్, పర్ రోషిణి హుయి జరూర్ హై
సోతి జబ్ దునియా, యహా జాగ్నె క దస్తూర్ హై
యహా ఛల్తా నహి హై కోయి, బస్ భాగ్ రహె హై సారే
ఔర్ జొ రుక్ గయా ఉస్కా జీనా ఫిజూల్ హై

బాంబె బాంబె తరరరం ప
బాంబె బాంబె సిటి నెవర్ స్లీప్స్
బాంబె బాంబె తరరరం ప
బాంబె బాంబె సిటి నెవర్ స్లీప్స్
బాంబె బాంబె తరరరం ప
బాంబె బాంబె బడీ హై అజీబ్
బాంబె బాంబె తరరరం ప

లోకల్ కి పట్రి, ధడ్‌కన్ ఇస్కి
ఛాట్ కి కప్డి, మెహ్‌ఫిల్ ఇస్కి
రౌనక్ కి దేఖో యహా ఫర్మార్ హై
లంహొంమె యహా, సాలోం కి రఫ్తార్ హై


బాంబె బాంబె తరరరం పం
బాంబె బాంబె సిటి నెవర్ స్లీప్స్
బాంబె బాంబె తరరరం పం
బాంబె బాంబె సిటి
నెవర్ స్లీప్స్
బాంబె బాంబె తరరరం పం
బాంబె బాంబె బడీ హై అజీబ్
బాంబె బాంబె తరరరం పం

సాలా ఏ షెహర్ భీ అజీబ్ హై
జన్నత్ సె దూర్ పర్ మన్నత్ కె కరీబ్ హై
మాంగతా మెహ్నత్ ఔర్ ఛల్తా సిర్ఫ్ నసీబ్ హై
బిల్డింగ్ తొ సబ్ బహుత్ సాలిడ్ హై
పర్ రిష్తోం మే ఓ బాత్ కహా
ఆజ్ ఇధర్ కల్ ఉధర్
కిస్కో మాలూం కల్ గుజ్రి కహా
కోయీ అప్నా నహీ, కోయీ సగా నహీ
ఐసా కౌన్ హై యహా జిస్కో మిలీ సజా నహీ
భూక్ సె నహీ హై మారా మారీ
పర్ ఖుద్గర్జీ ఔర్ లాచారీ
పెహ్లే కౌన్ ఆగే జాయే
తేరి యా మేరీ గాడీ
ముంబై ముంబై!!!
http://www.youtube.com/watch?v=_Ehx2_BUJ2o&feature=youtube_gdata_player

Jul 17, 2011

మిమ్మకాయ బొత్త

మిమ్మకాయ బొత్త తింటా నాన్నా!!
-అనఘ

దీనర్థం చెప్పినోళ్ళకి అమెరికాలో సగభాగం రాసిస్తా అని బజ్జు పెట్టాను
ఎక్కరూ కనుక్కోలేకపొయ్యారు...హహ్!!

ప్లస్సులో పెట్టాను..ఎవరూ కనుక్కోలేకపోయారు

మైనస్సులో పెట్టాను ఎవ్వరూ చెప్పలేకపొయ్యారు.
ఈవేళ అన్నగారు అడిగారు. ఇక చెప్పరా నాన్నా ఏటో అది అని..

మిమ్మకాయ = మిరపకాయ
బొత్త = తొడిమ
ఉప్పుమిరపకాయ (కొందరు ఊర మిరగాయలు అంటారు) వేయిస్తే, అనఘకి తొడిమ అంటే ఇష్టం అన్నమాట.

మిమ్మకాయ బొత్త = ఉప్పు మిరగాయ తొడిమ

Jul 16, 2011

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు
పరిశోధకుడి వెల్లడి చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని ఆలయాల్లో కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పరిశోధన పండితుడు ఎ.కృష్ణమాచారియర్‌ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని, ఈ విషయంపై తాను 2006లోనే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించానని బుధవారం విలేకరులకు తెలిపారు. తాను ప్రస్తుతం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. శ్రీరంగనాథ ఆలయ విస్తీర్ణం 37 X 27 అడుగులని తెలిపారు. గరుడ ఆలయం, ద్వారానికి 15 అడుగుల దూరంలో ఉందని తాను గుడి మొత్తం పరిశోధించానని ఆయన వివరించారు. తన పరిశోధనలను 18 సంపుటాలుగా 'శ్రీరంగం ఆలయం, ఆభరణాలు' పేరుతో విడుదల చేశానన్నారు.

ఇలాంటి వార్తల ద్వారా మీడియా మాధ్యమాలు ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా? ఇప్పటికే మన చరిత్రని కోల్పోయాం విదేశీ పరిపాలనలో. అరుదైన హైందవ కోవెలలు తునాతునకలు కావించబడి, ఆ స్థానంలో మశీదులు నిర్మింపబడ్డాయి. మన ఎనలేని సందని తురుస్కులు దోచగా, తెల్లవాడు నిల్చోబట్టి బట్టలు కూడా ఊడదీసుకు వెళ్ళిపొయ్యాడు. అడుగుబొడుగు మిగిలున్న మన హైందవ దేవళాలు, చారిత్రక సంపద, దొంగలపాలైంది. గుడి కట్టినప్పుడు, కోటలు కట్టినప్పుడు నవరత్నాలతో శంఖుస్తాపన చేస్తారని కొందరు, విగ్రహప్రతిష్ఠ జరిపేప్పుడు నవధాన్యాలతోపాటు నవరత్నాలతో విగ్రహాన్ని నిలబెడతారని కొందరు మూలమూలలల్లోని ఆలయాలను త్రొవ్వేసారు. పంచలోహ విగ్రహాలను తస్కరించారు. తురుష్కులపై, కిరస్తానీయులపై ఈగైనా వాలనీయని నిరంకుశ ప్రభుత్వం, కిమ్మని కూడా అనలేదు. దేవాలయాలకు దేవాలయాలు పాడుబడిపొయ్యాయి. వాటి సంపద దోచుకోబడ్డది. దేవాలయ భూమి నిరంకుశ ప్రభుత్వపు ఆధీనమైంది. అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్టు, ఈ భూమిని పందేరం చేస్కుంటున్నది ప్రభుత్వం. గుంటూరికి దగ్గర్లోని కొండవీటి కోటలో ఒకనాటి పాలకులు తప సంపదను నిక్షిప్తం చేసారని, ఇప్పటికీ వాటిని తొవ్వాలని ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడులోని అనేక దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు తస్కరించబడ్డాయి. పల్నాటిలోని కోటలు ఏనాడో శిధిలావస్తకు చేరి ఇప్పుడు కేవలం రాళ్ళా దిబ్బల్లా మిగిలాయి.
ఇక ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల వంతు. నిన్న పద్మనాభుని దేవళం. ఇవ్వాళ్ళ శ్రీరంగం.
ఇలాంటివి త్రొవ్వి సంపద ఉందని బయల్పరచి, ఎలాంటి తరంగాలను జనభాహుళ్యానికి అందిస్తున్నారు సదరు పరిశీలకులూ? ప్రభుత్వాలు? వార్తా సంస్థలూ?
బాబులూ, జనాలు, దొంగలూ, దోపిడీదారులూ, రాజకీయ వినాయకులూ, ఇక మీ ఓపిక కనిపించిన ప్రతీ గుడిని తొవ్వుకోడి!! దొరికిన వాడికి దొరికినంత అని చెప్పకనే చెప్తున్నాయి కదా ఈ పరిశీలనలు పరిశోధనలు.

రేపటి తరాలకు ఇప్పటికి *మన చరిత్ర* వెన్నెముక లేకుండా చేస్కున్న ఈ తరాలు, ఇలా చేసి, కనిపించిన ప్రతీదేవళాన్న, అంతిమ దిశకు చేరుకున్న చారిత్రాత్మక కట్టడాలను *నిధి నిక్షేపాల* పేరుతో కూలగొడితే!! మిగిలేది ఏవిటీ?

ఎంతకాలం కల్లబొల్లి కబుర్లు చెప్తారు హోం మాష్టారూ?

*మనకు పొరుగున ఉన్న పాక్‌, అఫ్గానిస్థాన్‌లు ఉగ్రవాద కేంద్రాలు. అందువల్ల భారత్‌లోని ప్రతి నగరం ప్రమాదపుటంచున ఉన్నట్లే.

ఎంతకాలం ఇలా కల్లబొల్లి కబుర్లు చెప్తారు హోం మాష్టారూ? ఎవరు పాలిస్తున్నా హోం మాష్టారి మాటా మాత్రం మారటంలేదు.
మన చట్టాలను మన వ్యవస్థనూ గట్టి చేస్కోకుండా పొరుగున ఉన్నవాళ్ళూ అంటే రాగాలు తీస్తే ఎలా మాష్టారూ?
అసలు సదరు తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా చొచ్చుకు వచ్చారో మాకు చెప్పి తీరాలి మాష్టరూ!! ఎలా రాగలిగారు? వాళ్ళు బైటివాళ్ళా లేక ఇక్కడివాళ్ళే అక్కడకెళ్ళి తీవ్రవాద విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పుచ్చుకుని వస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే, ఇక్కడివాళ్ళు అక్కడకి ఎలా వెళ్ళగల్గుతున్నారూ? సినిమాల్లో చూపినట్టుగా, ఇక్కడ ఓ వ్యక్తిని చూపి కట్ చేస్తే ట్రైనింగ్ కాంప్ లో ఉన్నట్టుగా ఊహించుకోమంటారా మాష్టారూ?
స్వతంత్ర భారత అరవై ఏళ్ళ చరిత్రలో కాంగ్రేసువారి పాలనే ముప్పావువొంతు ఉన్నది మాష్టారూ?
ఎవరు దొంగలు? ఎవరి ఆలోచనా ఈ నరబలి? ఇక్కడి వ్యక్తులు అక్కడికి ఎలా వెళ్ళగల్గుతున్నారు? ఏమార్గం? ఎన్ని సార్లు? ఎంత మంది? బాంబులు పేలటం నిన్నా మొన్నటి కథ కాదుగా చిదంబరం మాష్టారూ? గత పాతికేళ్ళుగా నడుస్తున్న తంతే. ఈ పాతికేళ్ళలో ఒక్క అలాంటి మార్గాన్ని కనుక్కోలేక పోయిందా మీ ప్రభుత్వం మాష్టారూ?
మరెన్ని ప్రాణాలను బలిపెడదామని మీ ఆలోచనా?
మరెన్ని సంవత్సరాలు ఇలా నరమేథం చేస్తూ పాలించాలని మీ తపన?
మరెన్ని ఏళ్ళు ఇలా రాజకీయ లబ్ది కోసం జనాలను బలిపెట్టాలని మీ కోఱిక?
మరెన్ని ఏళ్ళు సమస్యలను పక్కదారి పట్టించేందుకు మారణహోమం చేయ్యాలని మీ కుతంత్రం?

చెప్పండి హోం మాష్టారూ?

Jul 14, 2011

అమెరికాలో ముంబై తరహా దాడులు జరగక పోవటానికి కారణాలు.

అమెరికాలో ముంబై తరహా దాడులు ౯౧౧ తర్వాత జరగక పోవటానికి అనేకానేక కారణాలు.
అమెరికనులు ఎట్లాంటివారైనా బాహ్య ప్రపంచానికి, వాళ్ళూ ప్రజలే.
౧. వీరికి సామాజిక (వాళ్ళ సమాజమే అనుకోండి) స్పృహ కొంతైనా ఉంది.
౨. సందేహాస్పదంగా ఎవరైనా తిరుగాడుతుంటే వెంటనే ౯౧౧ కి కాల్ చేసేందుకు వెనుకాడరు
౩. ఇక్కడి చట్టం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తుంది.
౪. పోలీసు వ్యవస్థ నిర్ధిష్టమైన ఆడిట్ తో నడుస్తుంది. మనలాగా వార్డ్ కౌన్సిలర్ కాల్ చేస్తే ఉచ్చ పోస్కుంటూ నేరస్తులను వదలరు.
౫. పోలీసులు నేరస్తులను ఖచ్చితమైన ఆధారాలతో అరెస్టు చేస్తారు. ఆ ఆధారాలను అత్యంత ఆధునిక టెక్నాలజీతో సంగ్రహిస్తారు.

మనకి
౧. సమాజిక స్పృహ లేదు
౨. మనం ఎవర్నీ అనుమానించం, అనుమానించినా పోలీసులకు కాల్ చేయం. హా ఆ తలనొప్పి ఎవడిక్కావాలి అనుకుంటాం. ఒక వేళ కాల్ చేసినా, మైనారిటి అనే ప్లకార్డ్ పైకి వస్తుంది.
౩. మన చట్టం వాయిదాల చట్టం. శిక్ష పడటానికి పట్టే కాలం జీవితకాలం కన్నా ఎక్కువే. ఒకవేళ కఠినంగా శిక్ష పడినా, అది పేపరు మీదనే.
౪. పోలీసు వ్యవస్థకి ఆడిట్ లేదు. ఇష్టా రాజ్యం. వార్డ్ కౌన్సిలరుకు కూడా యస్.ఐ సెల్ ఫోన్ నెంబర్ తెలుస్తుంది. స్టేషన్ కి వచ్చే కాల్స్ లాగ్ అవవు. పోలీసులు కమ్యూనికేషన్ కొరకు సొంత సెల్స్ వాడతారు. ఇత్యాదివి.
౫. పోలీసులు ఎవర్ని అరెస్టు చేస్తారూ వారు నేరం అంగీకరిస్తారు. టెక్నాలజీ అంటే మనవాళ్ళకి, వెదురు కఱ్ఱల స్థానంలో ప్లాస్టిక్ పైపులు.
౬. మన పోలీసులు సమాజాన్ని కాపాట్టం కన్నా రాజకీయ నాయకులను వారి ఆస్థులను కాపాట్టం తవ విధిగా కర్తవ్యంగా పరమావధిగా భావిస్తారు

Jul 8, 2011

ఆపీస్ అగసాట్ల కైత

మా మేడమ్మ పిలిస్తే
అలా వెళ్ళానా
ఇలా ఓ సెవికి రింగేసి కూకో బెట్టింది
అటైపునుండి భావేష్ మొదలెట్టాడు
తీటాలో తాట
తాటలో తేట
మీటా బాటా
బటాటా అయ్యింది
అయ్యా భావేషయ్యా
నా చెవులు చేటలయ్యాయ్యా
ఇహ వదలవయ్యా అని
వదిలించుకుని
కసరుకొని
కసురుకుని
కాళ్ళు లాక్కుని
బూటలో పెట్టుకుని
చేతులు గుంజుకుని
పాయింటూ జోబిలో పెట్టుకుని
లటక్కున లగెత్తుకుంటూ
తల తిరుగుతుంటే తూలుతూ
పొర్లుకుంటూ
పడుతూ లేస్తూ
వస్తుంటే
దారిమధ్యలో
మా మేనేజరమ్మ
బాబూ నీ సమయపత్రం మీద
దస్తఖత్తు చేసిస్తా రా
చేయ్యాలంటే నా సోది మరి
పాతిక కేజీలు వినాలంటే
బెంగతో
బుంగమూతితో
బుంగెడు నీళ్ళతో
భారంగా కదులుతూ
విని
తరించి
ఇదిగో ఇప్పుడే వచ్చి కూలపడ్డా
నా కుర్చీలో
కాళ్ళే లేని కుర్చీలో
బతుకు కుర్చీలో