Jul 22, 2011

అది హత్యా ఆత్మహత్యా ??

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి తెలంగాణ కోరుతూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, కేకే, వీహెచ్‌, బలరాంనాయక్‌, వివేక్‌, రాజయ్య, మధుయాష్కీ, రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, సారయ్య, జూపల్లి, తెదేపా ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, భాజపా నేతలు నిర్మలా సీతారామన్‌, లక్ష్మణ్‌ తదితరులు గురువారం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


ఇదేందిదీ? ఏపి భవన్లోకి అనుమతించలేదు. అప్పుడు మార్చురిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చుగా? అసలు శవాన్ని మార్చురీలో ఉంచాలా ఏపిభవన్లో ఉంచాలా అనేది పోలీసులు పోస్టుమార్టం చేసినాక కదా?

ఎపి భవన్లో ఉంచితే మర్యాద ఇచ్చినట్టు అని ఓ పెద్ద మనిషి అంటా ఉన్నాడు. అంటే మార్చురిలో పెట్టే శావాలన్నిటికీ అవమానం చేసినట్టా?



అయ్యా! నాదొక ఫండమెంటల్ ప్రశ్న
సదరు యాదిరెడ్డి గారు ఆర్మహత్య చేస్కున్నాడని వార్తాపుత్రికలు రాసుకొస్తున్నాయి. అది ఎవరు ధృవీకరించారు?
అది హత్యా ఆత్మహత్యా అని ఎవరు పరిశోధన జరిపారు? రిపోర్టెక్కడా? ఎపి భవన్లో ఉన్న వ్యక్తి చెట్టుకి ఉరేస్కున్నాడంటే ఎలా వేస్కోగలిగాడు? తాడుని ఎలా తీస్కెళ్ళ గలిగాడు. కొమ్మకి ఎలా కట్టగలిగాడూ? చెట్టుపైకి ఎక్కి తాడు కట్టుకున్నాడా? లేక బెంచి వేస్కుని తాడు కట్టాడా? బెంచి వేస్కుని ఎక్కితే అక్కడ బెంచి దొరికిందా?

చెట్టు కొమ్మకి తాడు కట్టిన వ్యక్తి ఉరిని మెడకు ఎలా ధరించగలడూ? ఎలా ఉరిపోస్కోగలడూ? తాడు మెడకేస్కుని కిందకి దూకాడా? అలా దూకితే చెట్టు కదల్లేదు, ఎవరూ చూళ్ళేదా?

తెలంగాణ రావాల్సిందే!! దానికి ఇవి కాదు మార్గాలు.
అమాయకుల ప్రాణాలను హరించి, శవాలపై తెలంగాణ పోరాట ఏనుగలును నడిపించి ఇదే పోరాటం అంటానికి తె పోరాట కర్తలు ఛెంగీజ్ ఖాన్లు బాబరు అక్బర్లు కారు. ఇది వెయ్యేళ్ళక్రితం సమాజం కాదు. ఇకనైనా ప్రాణాలతో చెలగటాలను ఆపి, సక్రమమైన మార్గంలో పోరాటం చేస్కోండి. విలువైన ప్రాణాలను కాపాడండి. సామాన్యుల ఆస్థులను కాపాడండి. ప్రభుత్వ ఆస్థులను కాపాడండి.

జై హింద్
జై జన్మభూమి

[గమనిక - పిచ్చి పిచ్చి అసందర్భ కమెంట్లు ప్రచురింపబడవు]

No comments:

Post a Comment