Apr 21, 2020

సామాజిక మాధ్యమాలు/నెటిజనులు

సామాజిక మాధ్యమాలు అనేవి గొప్ప పాత్ర పోషించవచ్చు నేటి సమాజంలో. వాటి పాత్ర constructive side of the world అనేదాంట్లో ఎంత ఉందీ అనేది పక్కన పెడితే, destructive side ఎంతా అనేది ఒకసారి చూద్దాం.
అయితే ముందస్తు మీమాంశ
తప్పు తుపాకీదా? కాల్చేవాడిదా?
తప్పు Technology దా దాన్ని వాడేవాడిదా?
తప్పు కారుదా దాన్ని తోలేవాదిదా?
ఇలాంటి వాటికి సమాధానం వెతకటం కంటే బొంత ఊతకటం ఎలా అనే వీడియో చూట్టం ఉత్తమం.

ఈమధ్యకాలంలో వార్తాపుత్రికలు - వైరల్ అనే పదానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాయో మనం చూడొచ్చు.
అలాంటివాటిల్లో నన్ను తీవ్రంగా ఉద్రేకపరచినవి, నన్ను కుదిపివేసినవి, బాధపెట్టినవి, అసహనానికి గురిచేసినవి కొన్ని వీడియోలో సదరు సామాజిక మాధ్యమాలల్లో విరివిగా చక్కర్లు కొట్టాయి.

1. covid 19 policing పోలీసుల మీద జనాల దాడి.
2. shaheenbag విషయంలో జరిగిన దాడులు
3. కశ్మీర్ లో జరిగిన దాడులు
Example

ఈ వీడియోలను చూస్తే ఎంద ఘోరంగా ఉన్నాయో అనే విషయాన్ని పక్కనపెడితే - ఇవి ఎలాంటి అడుగు వేయటానికి దారిచూపుతున్నాయి అనేది ముఖ్యమైన మౌళికమైన ప్రశ్నగా నాకనిపిస్తుంది.

దేశాన్ని మతపరంగా ముక్కలు చేయటనికి ఈ విడియోలు ఎంతగా ప్రోద్బలాన్ని ఇస్తున్నాయో చెప్పాల్సిన పని లెదు.

నా దృష్టిలో అలజడులు జరిగేప్పుడు ఇంటర్నెట్ ని ఆపేయటం గొప్ప ఆలోచన. article 370 revoke సమయంలో మోడి కశ్మీరులో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయతం గొప్ప దార్శనికతకు నిదర్శనం అని నా అభిప్రాయం.

ఎందుకంటే - వదంతులు అగ్గిలాగా వ్యాపిస్తాయి. అవి నిజాలని మోయవు. వదంతులు కేవలం రెచ్చగొట్టేవే కానీ నిజాలు కావు.

ట్విట్టర్ లో టపాలు కూడా అధికశాతం - opinions మాత్రమే.
సాక్షి కానీ ఈనాడు కానీ ఆమాటకొస్తే ఏవార్తపుత్రికైన opinions ని జానాలమీద ఎందుకు రుద్దాలి?
opinions ని జనాలు ఎందుకు మోయాలి? opinion is not truth. జర్నలిజంలో ఇది నేర్పరా?

Trump లాంటి వాళ్ళు ట్విట్టర్ ని అధికార ప్రకటనల కోసం వాట్టం కేవలం దౌర్భాగ్యం.

No comments:

Post a Comment