Feb 2, 2011

వారికి ప్యాకేజీ ఇస్తాం - కిరణ్‌కుమార్‌రెడ్డి

మక్కామసీదు కుట్ర హిందూసంస్థలదే
కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌ : మక్కామసీదులో బాంబు పేలుళ్లకు పాల్పడింది హిందూ తీవ్రవాద సంస్థలేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హఫీజ్‌బాబానగర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ నగరంలో మత కలహాలు సృష్టించేందుకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలనుంచి కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మక్కామసీదు పేలుళ్ల అనంతరం ముస్లిం మైనార్టీ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని వారికి ప్యాకేజీ ఇస్తామని ఆయన ప్రకటించారు

అత్భుతమైన అలోచన. వచ్చే ఎన్నికల దాకా కిరణ్‌కుమార్‌రెడ్డి, నువ్వు కుర్చీలో ఉంటే, కాంగ్రేస్ గెలుస్తుందీ, నువ్వే సీయం.




జైహింద్

3 comments:

  1. ఏంటి ఇది నిజమా? మక్క మసీదు ఘటన వెనక హిందూ ఎలిమెంట్స్ ఉన్నాయా?!!!

    ReplyDelete
  2. కుమార్ గారు ఏంటి ఈ పిచ్చి ప్రశ్న..........అవును... హిందూ తీవ్రవాద సంస్థలే ఈ దాడులకు కారణం....!!! అస్సలు ప్రపంచ వ్యాప్తం గా తీవ్రవాదం అనే ఒక విషాన్ని చిమ్మించింది ఈ హిందువులే...!!!నాసా డిస్కవరీ బ్లాస్ట్ కూడా వీరి పనే....!!! బ్రిటిష్ పెట్రోలియం అయిల్ స్పిల్ల్ కూడా వీరి పనే....!! ఉత్తర కొరియా అణు సామర్థ్యం వెనుక కూడా ఉన్నది హిందువులే....!! కాష్మీర్ లో అమాయక ముస్లిం లను రాచి రంపాన పెట్టి పండిత్ లను గెంటేసింది కూడా ఈ హిందు సంస్థలే.....WTC కూల్చింది కూడా వీరే.... తాలిబాన్ లు అమాయకులు ఈ హిందువులే తాలిబాన్ పేర అక్కడ అక్రుత్యాలు చేస్తున్నారు.....!! ఒక్క మక్కా మసీదేం ఖర్మ దేశం లో కాదు కాదు ఈ ప్రపంచం లో జరిగే అన్ని పేలుళ్ళకీ ఏకైక కారణం హిందూ ఉగ్రవాదం .. ...

    ReplyDelete