Aug 5, 2008

ఎనుబోతు, కవి, అచేతనుడు, మనిషి, మట్టి మషాణం

సెల్ లో శ్రీవారి ఆలయ చిత్రాలు: ఈనాడు
ముంబైకి చెందిన భక్తుడి చిత్రీకరణ..యం.యం.యస్.ల ద్వారా ప్రసారం...
తిరుమలలో భద్రత మరోసారి ఉత్తుత్తిదే అని మరోసారి తేలిపోఇంది...

ప్రభుత్వం గద్దెదిగాలి...అసలు ప్రభుత్వం ఏమిచేస్తోంది? ఒక భక్తుడు మొబైల్ ఫోను ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఇదంతా రాజశేఖర్ కుట్ర, వెంటనే ఆంధ్ర రాష్ట్రానికి క్షమాపణలు చెప్పుకుని రాజీనామా చెయ్....

అహమ్మదా బాదులో బాంబులు..బంగళూరులో బాంబులు..
అశాంతి, విజయశాంతి..కేసీఆర్..చెంబా, వియసార్, భూమి కబ్జా..దేశమ్లో దొంగలు పడ్డారు..
సమాచార విప్లవం, సమాచార చోరి, ఎలక్ట్రానిక్ మీడియ విప్లవం, అతి సమాచారం, మట్టి మశాణం..

ఇంతకీ నేనేం చెప్దామనుకున్నానంటే....నా బ్లాగు నాఇష్టం, నా సెల్లు నాఇష్టం..నా బతుకూ నాఇష్టం, దేశం ఎటుపోతే నాకేం, నువ్వు ఏమైతే నాకేం..భద్రత ఎటుపోతే నాకేం....అందుకే నన్ను ఎనుబోతు అని కూడా అంటారు, కొంతమంది నన్ను కవి అనికూడా అంటారు (ముద్దుగా కావొచ్చు, కోపంగా కావొచ్చు, అసహ్యంగా కావొచ్చు, మరోలా కావొచ్చు - అర్ధంకాలేదా...నీఖర్మ) , కవి అంటే నీకుతెలియదా? ఏటి, దేశానికి కొత్తా నువ్వు? కవి = క వి = కనపడదు వినపడదు.....ఇంతకీ నేనెవరు?? సామాన్య మానవుడ్ని....నా బతుకింతే...

3 comments: