Jul 27, 2008

బాంబులు పేల్చటం - సిగ్గుచేటు

తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు, పుట్టిన దేశానికే ద్రోహం చేయ్యమని ఏమతం చెప్తుంది?
ఇది మన సమాజ పతనానికి ఒక మచ్చుతునక, అలాంటివాళ్ళకి సహాయం చేస్తున్నందుకు. మన జాతి ఏవత్తు సిగ్గుపడాలి ఇలాంటి వ్యవస్థని నిర్మించుకున్నందుకు, ఇలాంటి రాజకీయ నాయకులని ఎన్నుకున్నందుకూ, ఇలాంటి రాజకీయ వాదుల్ని పెంచి పోషిస్తున్నందుకు...

5 comments:

  1. ఓట్లకోసం మన రాజకీయనాయకులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నంతవరకుమనకు తప్పదు.పాముకు పాలు పోసి పెంచినట్టుంది మన నాయకుల వ్యవహారం.పాములకు కాటువేసే లక్షణం సహజమేకదా.

    ReplyDelete
  2. నిజమే విజయ్ గారు నేను మీతో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  3. అదేంటి, అలా అనేసారు, బాంబ్ లు పేల్చటం మన రాజ్యాగం లెకపొతే, మన రాజకీయ నాయకులు ఇచ్చిన హక్కును వాళ్లు వినియొగించుకొంటుంటె, మీరేమిటి, వాళ్లను నిలదీస్తున్నారు. మన రాజ్యంగం ఇచ్చిన హక్కుల గురించి కావాలంటే, మంద క్రిష్ణ నో, లెకపొతే కూడలిలో వున్న ఆయన వీరాభిమానులనో అడగండి. రెండిటికి సంభంధం ఏమిటి అంటారా, ఇద్దరూ వాళ్లకు ఈ తొట్టి రాజకీయనాయకులు ఇచ్చిన హక్కులను సద్వినియోగ పరుచుకొంటున్నామనే అనుకొంటున్నారు. వీళ్లకు తొక్కలో అభిమానులు వున్నారు అనేది కూడ "నిజమే".
    మొన్న ఈ మద్య ఇలాంటి అభిమానిని ఎమయ్యా పెద్దమనిషి బాంబ్ లు ఎందుకు పేల్చుతున్నారు అంటావ్ నువ్వు అభిమానించే (నక్సలైట్లు, ముస్లింలు (ముక్యంగా బాంబ్ లు పెల్చే వాళ్లు), అమ్ముడు పోయి మరీ, ఆ మాట అంటే వుడుక్కొనే వెధవలు అందరు etc) వాళ్లు అంటే , ఆ పెద్దయన నాకు జ్ఞానోపదేశం చేసాడు.
    అంతక ముందు ఎంతో మంచిగా వుండి, ఈ దేశం లో, కలిసిపోయిన ముస్లిం సోదరులను, వాళ్ల మసీదు ( పడగొట్టి కొందరు రెచ్చగొట్టారు, అందుకనే వాళ్లు ఇలా చేస్తున్నారు అని. ఆయన మాటలలో "డొల్లతనం" కనబడినా మళ్లీ ఎమయినా అడుగుతే, ఇంకేమి జ్ఞానోపదేశం చేస్తాడో అని, అక్కడనుండి పరుగు లంకించుకున్నా.

    ReplyDelete
  4. ఇంత జరిగాక, రాజకీయనాయకుల్ని, రాజకీయశక్తుల్ని అంటారెందుకూ? నా ప్రశ్న వ్యవస్థ మీద. ఆ వ్యవస్థని తయ్యారు చేసుకున్న మన మీద? రాజకీయనాయకులు మనలోంచి పుట్టినవాళ్ళే. ఎలాంటి సమస్యనైనా సామాజిక చైతన్యం తో అంతమొందించవచ్చు. మనకి ఆ సామాజిక స్పృహ, ఆ సామాజిక చైతన్యం, ఆ సామాజిక బాధ్యత ఎప్పుడు తెలుస్థాయి అనేది ప్రశ్న?
    ఎక్కడో ఉన్న పక్క దేశం వాడి మాటని వినటానికి చెవులు బాగానే పని చేసినప్పుడు, బాబు నీవాళ్ళాని, నీ ఇంటి పక్కనున్నవాడిని, నీ ఇంటి ముందున్నవాడిని చంపకు అనే ఘోష వినపడకపోవటం "బాధ్యతా రాహిత్యం", అది పోరాటం కాదు. లోకంలో లంచగొండితనం పెరిగిపోయి, సామాజిక చైతన్యం నశించి, కంచే చేనుని మేస్తున్నప్పుడు వాటిpai పోరాడటం మరిచిపోయి అజెండా అంటూ ఏమిలేని పోరాటం చేయమని ఏ సిద్ధాంతం చెప్తోంది నక్సలైట్లకు? ఎటు పోతున్నాం మనం..ఏంటీ గోల?

    ReplyDelete
  5. anduke mana lo chaitanyam ravali kotha danam korukovali, samajam kosam, avineethini anthamondinchatam kosame thana agenda ga raajakeeyalu ane rompi ni prakshalanam kavinchataniki vasthunna chiranjeevini ni prothsahiddam....idedo nenu chiranjeevi fan ga no A/C plant ga no bhavinchakandi. Innirojulu entho mandi raajakeeyanayakulanu vallu manaku emi cheyyaru ani thelisi, valla aasthulani penchukotaniki matrame adhikaram lo ki vache vallanu gelipincham...mari ithaniki oka chance iddam...emantaru.

    ReplyDelete