Sep 29, 2020

భాజపా తన బొందని తానే పెట్టుకుంటున్నదని నా భావన

నిన్ననో మొన్ననో ఈ వార్త చూశాను

"భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు."


భాజపా తన బొంద తానే పెట్టుకుంటున్నదని అనిపించింది. పైన ప్రకటించిన ఇద్దరు వ్యక్తులూ భాజపా భావజాలంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన వాళ్ళు కారు. ఒకరు మరీ దారుణంగా కాంగ్రేస్ భావజాలంలోంచి వస్తే మరొకరు అవకాశావాద రాజకీయాలతో నెట్టుకుంటూ కేవలం పదవులే ముఖ్యంగా కేవలం లైంలైట్లో ఉంటానికే వచ్చిన వ్యక్తి. 


ఇలాంటివారికి పార్టీలో ప్రధాన్యత ఇస్తే ఎప్పటినించో పార్టీనే అంటిపెట్టుకుని భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తులు ఏమి చేయాలీ? వారికి గుర్తింపెదీ?


భాజపా తన బొందని ఈరకంగా తానే పెట్టుకుంటున్నదని నా భావన


No comments:

Post a Comment