Feb 4, 2010

ఆహార ధాన్యాల ధ్వంసం - జాతి విద్రోహం

అహా!! మొత్తానికి హైకోర్టు వజ్రాల్లాంటి మాటలు పలికింది. ఈ వార్త చూడండి.
http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=38
డిశెంబరు ౨౪ బంద్ సందర్భంగా మహబూబ్ నగర్ జుల్లాలో తహసీల్దారు కార్యాలయానికీ, ధాన్య గిడ్డంగికీ నిప్పుపెట్టారు మన *తెలంగాణా* సహోదరులు. దానివల్ల వంటనూనె, బంగారంలాంటి కందిపప్పు, పందార, బియ్యం మొత్తం యాభైలక్షల సరుకు మసి.
"ఇలాంటి సందర్భంలో దేశంలో సంభవిస్తున్న ఆకలి చావులని మరువరాదు: అన్నారు న్యాయమూర్తి. "కొన్ని కోట్లమంది దారిద్యరేఖకి దిగువన ఉన్నార"ని, "ఈ నేపధ్యంలో ధాన్యానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ నష్టం కలిగించటాన్ని జాతి వ్యతిరేక చర్య"గా న్యాయమూర్తి పేర్కొన్నారు.
"రాజ్యాంగంలోని ౫౧-ఎ అధికరణ మన విధులను తెలియజేసుంది".
"జాతికి చెందిన ఆస్తుల విధ్వంసంలో పాల్గొనే వ్యక్తి..భారతీయుడిగా విధులను ఉల్లంఘించినట్టే"నని స్పష్టం చేసారు.

పై వాటికి కారణాలు సరైన మార్గదర్శకం లేకపోవటం ఒక కారణం.

కొందరు పెద్దలు దీన్ని మార్గదర్శకం లేకపోటమే కాదు, కొవ్వెక్కి, సమాజిక బాథ్య లేక, తిన్నదరక్క అనికూడా అంటుంటారు.
బస్సులు తగలెట్టటం, కార్యాలయాల్ని తగలెట్టటం ఇవీ మనం ముందుతరాలకి నేర్పాల్సిన విద్యలు.
మొత్తానికి మంచి మాట చెప్పెరా సదరు న్యాయమూర్తి గారు.
ఐతే, ఈ నష్టాన్ని ఉద్యమకారులే, ఉద్యమ కర్తలే భరించాలి అని బిల్లు పంపితే బాగుటుంది.

No comments:

Post a Comment