Jan 20, 2012

సేవ చేయండి... మతం గోల వద్దు

సేవ చేయండి... మతం గోల వద్దు
* మిషనరీలకు జైరాం రమేష్‌ సూచన
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ క్రైస్తవ మిషనరీలకు పిలుపునిచ్చారు. అయితే... మతపరంగా ఎవరినీ ప్రభావితం చేయరాదని, లక్ష్మణరేఖ దాటరాదని ఆయన సూచించారు. ''దైవ ప్రేమను పొందిన వారు (కారిటాస్‌) మతమార్పిడి దిశగా ప్రయత్నించరనే అనుకుంటున్నాను'' అని రమేష్‌ వ్యాఖ్యానించారు. క్యాథలిక్‌ సంస్థ 'కారిటాస్‌ ఇండియా' స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. ''ప్రభుత్వానికీ, గిరిజనులకూ మధ్య నమ్మకాన్ని ప్రోది చేయడమే మీ బాధ్యతకావాలి'' అని హితవు పలికారు.
ఈనాడు: 1/20/2012
ఇది జైరాం రమేశ్ మాటా? లేక కాంగ్రేస్ యోచనా? లేక మావోయిస్టుల సూచనా? లేక కమ్యూనిస్టుల యాచనా?

2 comments:

  1. భాస్కర్ గారూ,

    >> ఇది జైరాం రమేశ్ మాటా? లేక కాంగ్రేస్ యోచనా? లేక మావోయిస్టుల సూచనా? లేక కమ్యూనిస్టుల యాచనా?

    పై వాటిలో ఏదైనా, చెప్పిన విషయమైతే మంచిదే కదా !!

    ReplyDelete
  2. విషయం అక్కడితో ఆగుతుందా? ఆపేదెవరూ? కాంగిరేసు ప్రభుత్వమా? సానీయా గాంధీనా? లేక రాహు గాంధీనా?
    అదన్నమాట

    ReplyDelete