Feb 16, 2019

దాడి చేసింది ఎప్పట్నుంచో అక్కడ స్థిరపడిపోయిన కాశ్మీరీ

వార్తా విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు, సామాన్యులు, ఇరువర్గాలలోని మేధావులు,  ఒప్ప్రెస్డ్ పిపుల్, బాధలు అనుభవించినవారు, బాధలుపడ్డవారు - నానాజాతులు ఉగ్రదాడిపై వివిధరకాలుగా స్పందించవచ్చు.
తప్పులేదు.
కానీ ప్రజలమీద ఆధారపడి, మెక్కుతూ, బొక్కుతూ, కన్నూ మిన్నూ కానక, బలుపుతో రాజకీఈయనాయకులు విసిరే ఖండనలు స్టేట్మెంటులు వాళ్ళ భజనపరులకు కమ్మగా ఉంటాయేమోగానీ - మిగతావారి సహనాన్ని మాత్రం తప్పక పరీక్షిస్తాయి.
ఉదాహరణకు - ఒమర్ అబ్దుల్లా
దాడి చేసింది ఎప్పట్నుంచో అక్కడ స్థిరపడిపోయిన కాశ్మీరీట.

వీడి ఘోష అర్థమైంది. కానీ సహనాన్ని పరీక్షించేది - ఎప్పట్నుంచో ఇక్కడున్న అనేవాడి ధోరణి.
నిజమా?
ఎప్పట్నుంచున్నాట్టా జవానులన మీదకి వెళ్ళిన సదరు వీరుడు?
ఒమర్ అబ్దుల్లా దృష్టిలో - తరతరాలుగా ఉన్నాట్ట.
ఎన్నితరాలుగాట?
జనాలల్లో ఐక్యత పాలకుల రాజకీయ పరిధిలో ఉంటుంది. పాలకులు జనాలని ఐక్యం చేయగలరు, విడదీసి పాలించి పబ్బం గడుపుకోగలరు.
ఒమర్ అబ్దుల్లా లాంటివారి వల్ల ఐక్యత అసంభవం!



1 comment: